E-Paper
Advertisement

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 25 మంది మృతి, లైవ్ విజువల్స్

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 25 మంది మృతి, లైవ్ విజువల్స్
Advertisement

Bus Accident: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌బారి జిల్లాలో ఓ బస్సు దురదృష్టవశాత్తు పద్మా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి లైవ్ విజువల్స్ ఇప్పుడు చూద్దాం.

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు

Advertisement

బంగ్లాదేశ్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌బారి జిల్లాలోని గోలందా ప్రాంతంలో ఓ బస్సు దురదృష్టవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. స్పాట్‌లో 25 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో నలుగురు పురుషులు, 10 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ మీడియా విభాగం తెలిపింది.

ఈద్ సెలవులు ముగించుకుని ఢాకా వెళ్తోంది సుమారు 40 మంది ప్రయాణికుల బస్సు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈత కొట్టుకుంటూ ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత మరికొందర్ని కాపాడాడు. కనీసం 11 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డాడు.

Advertisement

25 మంది ప్రయాణికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈ ఘటన బుధవారం సాయంత్రం సుమారు 5.15 గంటల సమీపంలో జరిగినట్టు తెలుస్తోంది. పాంటూన్ నెం 3 వద్ద సౌహార్డో పరి బహన్ ప్రాంతంలో వేగంగా వంతెనపైకి దూసుకొచ్చింది బస్సు. డ్రైవర్ కంట్రోల్ చేయకపోవడంతో అదుపు తప్పి నదిలో పడిపోయింది. సుమారు 30 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.

గురువారం నాటికి మొత్తం 23 మృతదేహాలను వెలికి తీశారు. ఘటన జరిగి ఆరు గంటల తర్వాత హమ్జా అనే నౌక సహాయంతో నదిలో మునిగిపోయిన బస్సుని బయటకు తీశారు. గంగానదిలో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‌లో ఆ నదిని పద్మ నదిగా పిలుస్తారు అక్కడి ప్రజలు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: అల్వాల్ లో దారుణం.. సొంత తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు, అల్లుడు

 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×