Bengaluru Road Accident: బెంగళూరులో బుధవారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఉత్తర బెంగళూరులోని హెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని థానిసంద్ర సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగనగౌడ తన రెండేళ్ల కుమార్తె వర్ష, నాలుగేళ్ల మేనకోడలు భానుతో కలిసి స్కూటర్పై పాలు కొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నాగనగౌడ తన చిన్నారులతో కలిసి ప్రయాణిస్తుండగా, విద్యార్థుల పికప్ కోసం వస్తున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు మలుపు తిరుగుతూ వీరి స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి స్కూటర్ పై ఉన్న చిన్నారులిద్దరూ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. దురదృష్టవశాత్తు, అదే సమయంలో వస్తున్న బస్సు వెనుక చక్రం ఆ పిల్లల పైనుంచి వెళ్లడంతో, వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో నాగనగౌడ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఘటనపై సమాచారం అందుకున్న హెన్నూరు ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నారు. కళ్ల ముందే ఇద్దరు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
#Watch | CCTV captures tragic moment as school bus runs over two-wheeler, leaving 2 kids dead in #Bengaluru
Two children aged four and two were killed after a school bus collided with a scooter in northeastern Bengaluru’s RK Hegde Nagar on Wednesday morning, February 11.
The… pic.twitter.com/EUipXsJ3bc
— GPlus (@guwahatiplus) February 11, 2026