BigTV English
Advertisement

Chevella Road Accident: మర్రి చెట్టును ఢీకొట్టి.. చేవెళ్లలో మరో యాక్సిడెంట్‌

Chevella Road Accident: మర్రి చెట్టును ఢీకొట్టి.. చేవెళ్లలో మరో యాక్సిడెంట్‌

Chevella Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలు, చేవెళ్లలో బస్సు ప్రమాదాల్లో 38 మంది మృతి చెందారు. తాజాగా చేవెళ్ల బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ వద్ద హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు మర్రి చెట్టును ఢీకొట్టింది. రోడ్డు ఇరుకుగా ఉన్న మార్గంలో వేగంగా వచ్చిన కారు మర్రిచెట్టును ఢీకొట్టింది. కారులోని ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


నలుగురు తెలంగాణ వాసులు మృతి

కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో-కారు ఢీ కొనడంతో నలుగురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. మృతులు నవీన్‌ (40), రాచప్ప (45), నాగరాజు (26), కాశీనాథ్‌ (60)గా గుర్తించారు. గణగాపూర్ నుంచి కారులో వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

వరుస ప్రమాదాలు

రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన రేకిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం నివారణ చర్యలపై దృష్టి పెట్టింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, అవగాహన అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.


రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ

ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో నిర్వహించే రోడ్ సేఫ్టీ మాసంలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల తీరును ఈ సమావేశంలో మంత్రి ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేందుకు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని, కరపత్రాలు పంచాలని సూచించారు. రోడ్డు భద్రతపై విద్యాసంస్థల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించాలన్నారు.

Also Read: Secret Camera In Washroom: హాస్టల్ వాష్ రూమ్ లో స్పై కెమెరాలు.. వీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ కు పంపిన మహిళా ఉద్యోగి

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1. 50 లక్షలు వరకు అందిస్తూ, ఉచిత చికిత్స అందించే పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

Related News

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Anantapur Crime: ఫ్యాన్‌కు ఉరేసుకుని బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. కారణం ఏంటి..?

Secret Camera In Washroom: హాస్టల్ వాష్ రూమ్ లో స్పై కెమెరాలు.. వీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ కు పంపిన మహిళా ఉద్యోగి

Jagtial Snake Bite: నెల రోజుల్లో ఏడుసార్లు పాము కాటు.. పగబట్టిందేమోనని కుటుంబ సభ్యుల భయాందోళన

Bidar Road Incident: ఘోర ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. స్పాట్‌లో ముగ్గురు..

Crime News: దారుణం.. పరీక్షల్లో ఫెయిలయ్యానని హీలియం గ్యాస్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..

Big Stories

×