E-Paper
Advertisement

Jangaon Crime: అదే సమస్య.. జీవితంపై విరక్తి, చివరకు దంపతులు ఆత్మహత్య

Jangaon Crime: అదే సమస్య.. జీవితంపై విరక్తి, చివరకు దంపతులు ఆత్మహత్య

Jangaon Crime:  కారణాలు ఏమైనా కావచ్చు.. వచ్చిన కష్టాలను బయటవారితో చెప్పుకునే మనసు కొంతైనా కుదుటపడుతుంది. లేకుంటే రోజు రోజుకూ తీవ్రమై అనేక అనర్థాలకు దారి తీస్తోంది. ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెడుతున్న సందర్భాలు లేకపోలేదు.  తాజాగా అలాంటి ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వారికి వచ్చిన కష్టం ఎవరికీ చెప్పుకోలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

జనగామ జిల్లాలో దారుణం

జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం చిన్నరాంచర్ల గ్రామంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రామ్‌రెడ్డి- లక్ష్మి దంపతులు ఉంటున్నారు.  కొన్నాళ్ల కిందట వీరికి వివాహం జరిగింది.  కొంతకాలంగా ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. అప్పుల బాధలు రెట్టింపు అవుతున్నాయి. కానీ ఆదాయం పెరగడం లేదు.

జీవిత కాలం ఈ సమస్య వెంటాడుతుందని భావించారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.  ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దంపతులు పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించే లోపే పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను పొరుగువారు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

జీవితంపై విరక్తి చెంది.. దంపతులు ఆత్మహత్య

ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ  ఈ లోకాన్ని విచిడిపెట్టడం చిన్నరాంచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై విచారణ చేపట్టారు.  ఈ దంపతుల గురించి చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నంలో పడ్డారు. ఆర్థిక ఇబ్బందులా? మరేదైనా కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ALSO READ:  వికారాబాద్‌లో దారుణం.. కత్తితో ఓ వ్యక్తిపై మరొకరు దాడి, అంతా సీసీటీవీ కెమెరాలో

 

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×