E-Paper
Advertisement

వర్షం వస్తోందని చెట్టు కిందకు వెళ్లారు.. ఇంతలోనే ఊహించని ఘోరం!

వర్షం వస్తోందని చెట్టు కిందకు వెళ్లారు.. ఇంతలోనే ఊహించని ఘోరం!
Advertisement

Komaram Bheem: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలం కైరుగూడ గ్రామంలో పిడుగుపాటుకు గురై దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో తలదాచుకోవడానికి సమీపంలోని ఓ చెట్టు కిందకు ముగ్గురు కూలీలు వెళ్లారు. దురదృష్టవశాత్తూ వారు నిలబడిన చెట్టుపైనే ఒక్కసారిగా పిడుగు పడింది.

ఈ ప్రమాదంలో టెకం భీము (50), ఆయన భార్య రాజబాయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కన్నుమూశారు. కళ్లముందే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అలాగే వీరితో పాటు ఉన్న ఆత్రం గంగు అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా, ఇలాంటి ప్రమాదాలు జరగడం అందరినీ కలచివేస్తోంది.

Advertisement

Also Read: సీఎం రేవంత్‌కు మాజీ గవర్నర్ కీలక సూచన.. ఆ ఒక్క నిర్ణయంతో యువతలో మార్పు ఖాయం!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×