E-Paper
Advertisement

Samarlakota Family Incident: దారుణం.. తల్లీ, ఇద్దరు కూతుళ్ల హత్య.. కారణం ఏంటి?

Samarlakota Family Incident: దారుణం.. తల్లీ, ఇద్దరు కూతుళ్ల హత్య.. కారణం ఏంటి?

Samarlakota Family Incident: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో దారుణం జరిగింది. ఇంటిలో ఉన్న ఒక తల్లి, ఇద్దరు పిల్లల్ని బలమైన ఆయుధంతో తల పగులకొట్టి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. సీతరామ కాలనీకి చెందిన మలపత్తి మాధురి(26)కి జెస్సీలో(8), పుష్ప కుమారి(6) ఇద్దరు కుమార్తెలు.. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో కొట్టి చంపారు. వారి సెల్‌ఫోన్లు కూడా తీసుకెళ్లారు.

తల్లి, ఇద్దరు పిల్లల్ని తల పగులకొట్టి హత్య
సీతారామ కాలనీకి చెందిన ధను ప్రసాద్.. ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కంపెనీలో డ్రైవరుగా పని చేస్తున్నాడు. నైట్ డ్యూటీ నుంచి తిరిగొచ్చే లోపు అతని భార్యని, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేశారు. కుటుంబంలోని ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటంతో కన్నీరు మున్నీరయ్యాడు ధను ప్రసాద్. ఇంటి ముందు తలుపులకు తాళాలు వేసి ఉండగా.. వెనుక నుంచి వచ్చారని చెబుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం.. ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ధర్మస్థల కేసులో కొత్త మలుపు.. తెరపైకి మరో వ్యక్తి

భయందోళనలో గ్రామ ప్రజలు..
అయితే ఈ కేసులో నిందితులు ఎవరన్నది పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఎందుకు వీరిని చంపారు.. అసలు భర్తే విరిని చంపించాడా.. లేదా ఎవరికైనా వారిపై పగతో కుట్ర పన్ని ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఘటన తెలుసుకున్న గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని భయందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×