E-Paper
Advertisement

Pet Dog Killed: కుక్క పిల్లను నేలకేసి కొట్టి చంపిన పని మనిషి.. లిఫ్ట్ లో జరిగిన దారుణం సీసీ కెమెరాల్లో రికార్డ్

Pet Dog Killed: కుక్క పిల్లను నేలకేసి కొట్టి చంపిన పని మనిషి.. లిఫ్ట్ లో జరిగిన దారుణం సీసీ కెమెరాల్లో రికార్డ్
Advertisement

Pet Dog Killed: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. పెంపుడు కుక్క పిల్లలను చూసుకునేందుకు నియమించుకున్న కేర్ టేకర్.. అతి దారుణంగా వ్యవహరించింది. కుక్క పిల్లను లిఫ్ట్ లో నేల కేసి కొట్టి చంపింది. కోపంతో పని మనిషి కుక్కపిల్లను ఘోరంగా చంపిన దృశ్యాలు లిఫ్ట్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

పెంపుడు కుక్క పిల్లను చంపిన కేర్ టేకర్

బెంగళూరులోని అపార్ట్ మెంట్ లో ఉంటున్నవారు కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. తమ కుక్క పిల్లను చూసుకునేందుకు పెట్టుకున్న ఆమె మహిళ అతి కిరాతకంగా వ్యవహరించింది. బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ లోపల తన యజమాని పెంపుడు కుక్క పిల్లను చంపినందుకు 29 ఏళ్ల మహిళను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతిని తమిళనాడుకు చెందిన పుష్పలతగా గుర్తించారు. ఆ యువతిని ఎంబీఏ విద్యార్థిని అయిన రషిక తన పెంపుడు కుక్క పిల్లలను చూసుకోవడానికి నియమించుకుంది.

నెలకు రూ.23 వేల జీతం

Advertisement

పుష్పలత నెలన్నరగా రషిక ఇంట్లో పనిచేస్తుంది. ఆమెకు నెలకు రూ. 23,000 జీతం, అదే అపార్ట్‌మెంట్‌లో వసతి కూడా కల్పించారు. బెంగళూరు పోలీసుల ప్రకారం, పుష్పలత కుక్క పిల్లను లిఫ్ట్ లోపల దారుణంగా నేలకేసి కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయింది. నవంబర్ 1న పుష్పలత రెండు కుక్క పిల్లలను నడకకు తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. తిరిగి వస్తుండగా.. ఆమె లిఫ్ట్‌లోకి ఎక్కింది. పెంపుడు కుక్క పిల్లల్లో ఒకటైన గూసిని పుష్పలత లిఫ్ట్ లో బలంగా నేలకేసి కొట్టింది. అనంతరం అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చి, కుక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని రషికకు చెప్పి నమ్మించింది. పుష్పలత తీరుపై అనుమానం వచ్చిన రషిక అపార్ట్‌మెంట్ యాజమాన్యం సహాయంతో సీసీటీవీ కెమెరాలను చెక్ చేసింది. పుష్పలత కుక్క పిల్లను అతి దారుణంగా కొట్టిన దృశ్యాలు చూసి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Also Read: Coimbatore Gang Rape Case: కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. పోలీసులపై నిందితులు దాడి, ఆపై కాల్పులు

ఇంట్లో వస్తువుల చోరీ

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ఆదివారం ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కుక్క పిల్లలు నిరంతరం మొరగడంతో తాను విసుగు చెంది ఇలా చేశానని ఒప్పుకుంది. ఆమె ఇటీవల యజమాని ఇంటి నుండి విలువైన వస్తువులను దొంగిలించడంతో.. రషిక కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఇందుకు ప్రతీకారంగా పుష్పలత పెంపుడు కుక్క పిల్లను చంపిందని రషిక కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×