Expired Food: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక శ్రీరామ బేకరి పై సోమవారం అర్ధరాత్రి ఎస్వోటీ (SOT) పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో బేకరిలో గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కేకులు, ఇతర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా కాలం చెల్లిపోయిన ఫ్లేవర్లు, కలర్ కెమికల్స్తో పాటు ఇతర ముడి పదార్థాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
ఈ పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి హానికరమని పోలీసులు తెలిపారు. అదేవిధంగా, బేకరి వద్ద సరైన ఫుడ్ లైసెన్స్ కూడా లేకపోవడం గుర్తించారు. ఈ ఘటనపై బేకరి యజమానిపై కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Also Read: Summer Tips: కొబ్బరి నీళ్ల ఖరీదు ఎక్కువని.. చెరకు రసం తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఓ పక్క తెలంగాలణ ప్రభుత్వం కల్తీ రాయల్ల పై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ ఫుడ్ సెంటర్లో పోలీసు ఓ ప్రత్యేక బృందంగా ఎర్పడి వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాఱ రాష్ట్ర సీపీ సైతం కల్తీ ఫుడ్ తయారుచేసే వారిపై కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైన కల్తీ ఫుడ్ తయారు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో వరుస దాడులతో కల్తీ ఫుడ్ తయారు చే
స్తున్న అక్రామార్కులు ఎప్పుడు దాడులు చేస్తారో అని జంకుతున్నారు.
Also read: రీల్స్ పిచ్చి ..5వ అంతస్తు నుంచి కింద పడి 13 ఏళ్ల బాలిక మృతి