Tirupati: తిరుపతిలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. సరదాగా చేస్తున్న రీల్స్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారెడ్డినగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నేపాల్ దేశానికి చెందిన ధను బహదూర్ కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చింది. రాజారెడ్డినగర్లోని ఒక అపార్ట్మెంట్లో ధను బహదూర్ వాచ్మెన్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమార్తె పుష్ప (13) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు వీడియోలు, రీల్స్ చేసేది.
ఎప్పటిలాగే రీల్స్ చేయడానికి వీడియో సెట్టింగ్ చేసుకుంటున్న క్రమంలో.. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు అంచున అదుపు తప్పి కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. తన కళ్ల ముందే కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Also Read: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ డ్రగ్స్ వేట.. రూ. 25 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్!
రీల్స్ పిచ్చి ..5వ అంతస్తు నుంచి కింద పడి 13 ఏళ్ల బాలిక మృతి
తిరుపతి జిల్లా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
నేపాల్కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం తిరుపతికి వలస
ఓ అపార్ట్ మెంట్ లో వాచ్మెన్గా పనిచేస్తున్న కుటుంబం
ధను బహదూర్ దంపతుల 13 ఏళ్ల కూతురు పుష్ప
రీల్స్… pic.twitter.com/KpT77QDTgC
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2026