E-Paper
Advertisement

బిడ్డ పెళ్లైన కొన్ని గంటలకే తండ్రి ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

బిడ్డ పెళ్లైన కొన్ని గంటలకే తండ్రి ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Advertisement

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని నందిగామ గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. తన కన్న బిడ్డ పెళ్లి కోసం, తాను ప్రాణప్రదంగా పెంచుకున్న మూగ జీవాలను అమ్ముకోవాల్సి వచ్చిందన్న బాధతో ఓ రైతు తనువు చాలించాడు. నందిగామ గ్రామానికి చెందిన దేవన్న అనే వ్యక్తికి సుమారు వందకు పైగా మేకలు ఉండేవి. వాటిని అతను కేవలం పశువుల్లా కాకుండా, తన సొంత బిడ్డల్లాగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.

ఇటీవల తన కుమార్తె వివాహం నిశ్చయమవడంతో, పెళ్లి ఖర్చుల కోసం దేవన్న తన మందలోని 30 మేకలను విక్రయించాడు. కూతురి పెళ్లి అట్టహాసంగా ముగిసింది. అయితే, వివాహం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న దేవన్నకు ఇంటి ఆవరణలో పలచబడిన మేకల మంద కనిపించింది. ఎప్పుడూ కళకళలాడే మందలో తన కళ్లెదుటే పెరిగిన మేకలు కనిపించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Advertisement

బిడ్డ పెళ్లి జరిగిందన్న సంతోషం కంటే, తన ప్రాణ సమానమైన మూగజీవాలను దూరం చేసుకున్నానన్న బాధ ఆయనను కుంగదీసింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కన్న కూతురు అత్తవారింటికి వెళ్లిన కొన్ని గంటలకే తండ్రి ఇలా విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పెంపుడు జంతువులపై ఆయనకున్న మమకారం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: డేకేర్ సెంటర్ లో దారుణం.. పసిపిల్లలను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి కిరాతకం!

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×