Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో చెప్పడానికి ఈ దుర్ఘటనే నిదర్శనం. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ముదిరి, చివరకు ఇద్దరు పసిప్రాణాలు గాలిలో కలిసిపోవడమే కాకుండా, ఒక నిండు ప్రాణం బలవ్వడం అందరినీ కలిచివేస్తోంది.
అమలాపురం గ్రామానికి చెందిన షా వలి (35) తన ఇద్దరు కుమారులు విలాస్ (5), వికేష్ (3)లను తీసుకుని బయటకు వెళ్లి, తొర్రూర్ మార్కెట్ ఎదురుగా ఉన్న ఒక చెట్టుకు ఉరివేసి వారిని హతమార్చాడు. ఆపై అదే చెట్టుకు తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోకం తెలియని ఆ చిన్నారులు తండ్రి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, అసలు ఈ గొడవలకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: రూ. 100 కే 20 రోజుల శిక్షణ.. మహబూబ్నగర్ పిల్లల కోసం బాలోత్సవ్ సమ్మర్ క్యాంప్
భార్య భర్తల మధ్య గొడవ..ఇద్దరు పిల్లలకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమలాపురం గ్రామంలో విషాదం
మృతులు తండ్రి గంషావలి, విలాస్(5), వికేష్(3) గా గుర్తింపు
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Marital Dispute: Father Hangs Two Children, Commits Suicide… pic.twitter.com/2H00ctfNXZ
— BIG TV Breaking News (@bigtvtelugu) April 28, 2026