E-Paper
Advertisement

Srikakulam Road Accident: లారీని ఢీకొన్న తుఫాన్ వాహనం, ఎగిరిపడిన ప్రయాణికులు, శ్రీకాకుళం జిల్లాలో

Srikakulam Road Accident: లారీని ఢీకొన్న తుఫాన్ వాహనం, ఎగిరిపడిన ప్రయాణికులు, శ్రీకాకుళం జిల్లాలో

Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని తుఫాన్ వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్ లో నలుగురు మృత్యువాతపడ్డారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కి చెందినవారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఎలా జరిగింది?

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలంలోని ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తుఫాన్ వాహనం  నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ వాహనంలోని ఉన్నవారు మధ్యప్రదేశ్ కి చెందినవారు. వారంతా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఘటన జరిగిన ప్రాంతంలో నలుగురు మృత్యువాతపడ్డారు. చాలామంది గాయపడ్డారు. మృతులు సింగ్ పవార్ (60), విజయ్ సింగ్ తోమర్(65), కుసాల్ సింగ్ (62), సంతోషిభాయ్(62) లుగా గుర్తించారు.  మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

లారీని ఢీ కొన్ని తుఫాన్ వాహనం, స్పాట్‌లో నలుగురు మృతి

వాహనాలను పక్కన పెట్టారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా క్లియర్ ఇచ్చారు.  అంబులెన్సులో క్షతగాత్రులను కోటబొమ్మాళి ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు పొగమంచు కారణంగా చెబుతున్నారు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఘటన సమయంలో తుఫాన్ వాహనంలో దాదాపు 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: బయోడీజిల్ బంక్ లో బ్లాస్టర్.. ఇద్దరు స్పాట్‌లో

Related News

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

Big Stories

×