Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల ప్రభుత్వ హైస్కూల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పాఠశాల ఆఫీస్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గది మొత్తం వ్యాపించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదంలో ఆఫీస్ గదిలో భద్రపరిచిన విద్యార్థుల కీలక రికార్డులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రమాద సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. స్థానికులు, సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: తెలంగాణ కొత్త పవర్ సెంటర్.. ఇకపై పాలనంతా అక్కడి నుంచే.. సీఎం మెగా స్కెచ్!
స్కూల్లో అగ్నిప్రమాదం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల హైస్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. పాఠశాల ఆఫీస్ గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గదిలో ఉన్న కీలక రికార్డులు, పుస్తకాలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. pic.twitter.com/DzBOfIehfi
— ChotaNews App (@ChotaNewsApp) June 6, 2026