E-Paper
Advertisement

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!

Haryana Hospital: హర్యానాలోని కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన 15 ఏళ్ల మైనర్ బాలికపై ఓ డాక్టర్ కామాంధుడు కేవలం వంద రూపాయలు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం వ్యవస్థకే మచ్చ తెచ్చింది.

ఈ ఘోరం జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలో పీఎంఓగా ఒక మహిళా అధికారి ఉన్నా, ఓపీడీలో మహిళా నర్సులు అందుబాటులో ఉన్నా ఈ దారుణాన్ని అడ్డుకోలేకపోవడం అక్కడి భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఒక మైనర్ బాలికను పరీక్షించేటప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలను, నైతిక విలువలను పూర్తిగా గాలికొదిలేశారు.

బాధితురాలు అక్కడే ఉన్న సిబ్బందికి మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించకపోవడంపై హర్యానా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడితో పాటు అతడిని వెనకేసుకొచ్చిన ఆసుపత్రి యంత్రాంగంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇంతటి నిర్లక్ష్యానికి పాల్పడిన సిబ్బందిపై సమాజం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: మాచర్లలోని సినిమా థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Related News

మాచర్లలోని సినిమా థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పేలిపోయిన విమానం

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. ఏపీ వాసుల ముగ్గురు మృతి, మరో 15 మంది గాయాలు, బీహార్‌లో ఘటన

పాతబస్తీలో దారుణం.. భార్య గొంతుకోసి, పిల్లలను గదిలో బంధించి భర్త పరారు!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల భారం..? రైల్వే ఉద్యోగి ఆత్మహత్య!

ఐటీ హబ్‌లో విషాదం.. ప్రియుడితో గొడవపడి యువతి ఆత్మహత్య!

మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!

Big Stories

×