Haryana Crime: హర్యానాలోని ఝజ్జర్ జిల్లా సుబానా గ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. గ్రామానికి చెందిన హితేశ్ అనే యువకుడిని టార్గెట్ చేసిన దుండగులు, సినిమా ఫక్కీలో వచ్చి క్షణాల వ్యవధిలో ప్రాణాలు తీశారు. గ్యాంగ్స్టర్ రోహిత్ గోదర ముఠాకు చెందిన నలుగురు షూటర్లు ఒక కారులో వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. హితేశ్ కనిపించడమే ఆలస్యం.. ఏమాత్రం కనికరం లేకుండా అతనిపై తుపాకులతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు.
ఈ దాడి ఎంత వేగంగా, దారుణంగా జరిగిందంటే.. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే దుండగులు ఏకంగా 30 రౌండ్ల బుల్లెట్లు కురిపించారు. శరీరంలోకి అన్ని బుల్లెట్లు దూసుకెళ్లడంతో హితేశ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచాడు. నిందితులు కాల్పులు జరిపి అంతా అయిపోయిందనుకున్నాక ఏమీ తెలియనట్టు కారులో అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ట్రైలర్ ముగిసింది.. అసలు సినిమా ముందుంది.. మోడీ ‘పొదుపు’ హెచ్చరిక వెనుక అసలు కథ ఇదేనా?
10 సెకన్లలో 30 బుల్లెట్లు కాల్చి దారుణ హత్య
హర్యానాలోని ఝజ్జర్ జిల్లా సుబానా గ్రామంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన హితేశ్ అనే యువకుడిపై గ్యాంగ్స్టర్ రోహిత్ గోదర ముఠాకు చెందిన నలుగురు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కారులో వచ్చిన… pic.twitter.com/fcOeLNZfbv
— ChotaNews App (@ChotaNewsApp) May 17, 2026