BigTV English
Advertisement

Kuppam News: కుప్పంలో హర్యానా దొంగల గ్యాంగ్ బీభత్సం.. కారుతో పోలీసులపైకి, ఆపై కాల్పులు

Kuppam News: కుప్పంలో హర్యానా దొంగల గ్యాంగ్ బీభత్సం.. కారుతో పోలీసులపైకి, ఆపై కాల్పులు

Kuppam News: అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకునేందుకు కుప్పం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వాహనంతో వారిపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. వారిని పట్టుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు పోలీసులు. అసలేం జరిగింది?


చిత్తూరు జిల్లాలో కొన్నాళ్లుగా హర్యానా దొంగలు నానాహంగామా చేస్తున్నారు. అయితే వారంతా ఓ ముఠాగా ఏర్పడి కారులో ఏపీ సరిహద్దు దాటుతున్నాట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. డిఎస్పీ సూచనలతో పోలీసులు రంగంలోకి దిగారు. కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారి తంబిగానిపల్లె ప్రాంతంలో చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

రాత్రి పదిన్నర గంటల సమయంలో పలమనేరు నుంచి తమిళనాడు వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్‌ కలిగిన స్కార్పియోను పోలీసులు ఆపారు. వాహనాన్ని తనిఖీ చేసేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు ముందుకు వెళ్లారు. పోలీసుల రాకను గమనించింది దొంగల గ్యాంగ్. కారును వెనక్కి పోనిచ్చి కానిస్టేబుళ్లపై ఎక్కించేందుకు యత్నించింది.


పోలీసులు ఆ సమయంలో పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హర్యానా దొంగల ముఠాగా నిర్ధారించుకున్న పోలీసులు, తమ తొపాకులతో ఓ రౌండ్‌ కాల్పులు జరిపారు. దొంగలు వేగంగా కారుతో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో గాలింపు తీవ్రతరం చేశారు.

ALSO READ: కామాంధుడైన ప్రియుడికి కూతుర్ని బలిచ్చిన కన్నతల్లి

పరమ సముద్రం చెరువు సమీపంలో నిందితులు కారును వదిలి పారిపోయారు. హర్యానా దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తునారు. పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేసినట్టు నిర్ధారించారు. కారులో ఐదు మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

వారి కోసం సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దించారు పోలీసులు. ఇంకోవైపు డాగ్‌ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి.  ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయా ప్రాంతాల ప్రజలను కోరారు పోలీసులు.

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×