E-Paper

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ, ఏపీకి చెందిన 20 మంది వరకు

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ, ఏపీకి చెందిన 20 మంది వరకు

Road Accident: అతివేగం ప్రమాదకరం.. అతి వేగం వద్దని పోలీసులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి. బెంగుళూరు సమీపంలోని ఏపీకి చెందని ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి.

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఆదివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తోంది ఉదయగిరి డిపోకు ఆర్టీసీ బస్సు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు బెంగుళూరు సమీపంలోని చింతామణి ప్రాంతంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగ్రాతులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి సమచారం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు-స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆసుపత్రులకు తరలించారు.

బస్సు-లారీ ఢీ, ఏపీకి చెందిన 20 మంది వరకు గాయాలు

ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఘటనలో సమయంలో బస్సులో ఏపీకి చెందిన దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు, ట్రాఫిక్ క్లియర్ చేశారు.

బస్సు ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన ఎలా జరిగింది? అనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: షాదీ ముబారక్ పథకంలో భారీ స్కామ్.. రూ. 21 లక్షలు కొల్లగొట్టిన బ్రోకర్లు అరెస్ట్!

Related News

మెడికల్ షాపులో దారుణం.. క్యాషియర్‌పై దుండగుల కాల్పులు.. స్పాట్‌లో ఒకరు మృతి, సీసీటీవీ కెమెరా సాక్షిగా

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి, సిద్ధిపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Shadi Scam: షాదీ ముబారక్ పథకంలో భారీ స్కామ్.. రూ. 21 లక్షలు కొల్లగొట్టిన బ్రోకర్లు అరెస్ట్!

Label Tampering: ఓల్డ్ అల్వాల్‌లో డీసీఏ మెరుపు దాడులు.. రూ.70.56 లక్షల ఫార్మా స్టాక్ సీజ్..!

BMW కారు, 33 తులాల బంగారం, 25 మంది భార్యలు.. ఒకే ఒక్క ఫిర్యాదుతో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!

తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు!

×