Mango Tragedy: హైదరాబాద్లోని నారాయణగూడలో దారుణం చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నారాయణగూడ పరిధిలోని విఠల్వాడి అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వైజినాథ్, ఇందుమతి అనే దంపతులు జీవనోపాది కోసం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.
అయితే రేణుక అనే మహిళ తమ బందువు నారాయణగూడ జలమండలి ప్రాంతం సమీపంలో ఓ షాపులో మామిడి పండ్లను కోనుగోలు చేసి తమ బందువులైన వైజినాథ్ ఇంటికి తీసుకుని వచ్చింది. అనంతరం వాటిని ఇందుమతితో పాటు కుటుంభంలోని నలుగురి కుమార్తెలకు ఇచ్చింది. దీంతో పండ్లు తిన్న తరువాత నలుగురు పిల్లలకు ఓక్కసారిగి వాంతులు, కల్లు తిరగడం, వీరచనాలు మోదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంభ సభ్యులు తమ నలుగురి పిల్లలను కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెల్లారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి సోమవారం రోజున మృతి చెందింది. ఆ తర్వాత మరుసటి రోజున ఆమె చెల్లెలు సంధ్య కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మిగతా ఇద్దరు పిల్లల పరిస్ధతి కూడా విషమంగా ఉండటంతో ప్రస్ధుతం వారు చికిత్స పోందుతున్నారు.
జరిగిన సంఘనపై భాదితులు పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారులు తమ మామిడి పండ్లను తొందరగా మాగబెట్టడానికి ప్రమాదకర రసాయనాలను వాడి ఉండవచ్చని పొలీసులు అనుమానిస్తున్నారు. దీని ద్వారానే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని తెలిపారు.
Also read: హైదరాబాద్లో కీలక ఘట్టం.. ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్