E-Paper
Advertisement

Mango Tragedy: నారాయణగూడలో దారుణం.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి..!

Mango Tragedy: నారాయణగూడలో దారుణం.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి..!

Mango Tragedy: హైదరాబాద్‌లోని నారాయణగూడలో దారుణం చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నారాయణగూడ పరిధిలోని విఠల్‌వాడి అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వైజినాథ్, ఇందుమతి అనే దంపతులు జీవనోపాది కోసం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

ఇద్దరు మృతి..

అయితే రేణుక అనే మహిళ తమ బందువు నారాయణగూడ జలమండలి ప్రాంతం సమీపంలో ఓ షాపులో మామిడి పండ్లను కోనుగోలు చేసి తమ బందువులైన వైజినాథ్ ఇంటికి తీసుకుని వచ్చింది. అనంతరం వాటిని ఇందుమతితో పాటు కుటుంభంలోని నలుగురి కుమార్తెలకు ఇచ్చింది. దీంతో పండ్లు తిన్న తరువాత నలుగురు పిల్లలకు ఓక్కసారిగి వాంతులు, కల్లు తిరగడం, వీరచనాలు మోదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంభ సభ్యులు తమ నలుగురి పిల్లలను కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెల్లారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి సోమవారం రోజున మృతి చెందింది. ఆ తర్వాత మరుసటి రోజున ఆమె చెల్లెలు సంధ్య కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మిగతా ఇద్దరు పిల్లల పరిస్ధతి కూడా విషమంగా ఉండటంతో ప్రస్ధుతం వారు చికిత్స పోందుతున్నారు.

Also Read: Amaravati Projects: ఏపీ రాజధానిలో ఢిల్లీ లెవెల్ రాజకీయం.. 22 ఎకరాల్లో కేంద్రం వేస్తున్న భారీ స్కెచ్ ఇదే..?

ప్రమాదకర రసాయనాలు..

జరిగిన సంఘనపై భాదితులు పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారులు తమ మామిడి పండ్లను తొందరగా మాగబెట్టడానికి ప్రమాదకర రసాయనాలను వాడి ఉండవచ్చని పొలీసులు అనుమానిస్తున్నారు. దీని ద్వారానే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని తెలిపారు.

Also read: హైదరాబాద్‌లో కీలక ఘట్టం.. ఫ్యూచర్‌ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Related News

సుపారీ గ్యాంగ్‌తో భార్య హత్య.. ఎట్టకేలకు భర్త అరెస్టు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు

డ్యూటీలో ఉండగా.. కెనడాలో భారతసంతతి పోలీసు వీరమరణం!

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి!

మల్కాజిగిరిలో ఘోరం.. భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త!

ఫ్యామిలీని చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి, డెత్ నోట్‌లో కీలక విషయాలు, ఆపై ఫ్రీ బస్సుల స్కీమ్

ఏసీబీ దాడుల్లో సంచలనం.. మోహన్ నాయక్ అక్రమాస్తులు చూసి అధికారులే షాక్!

×