E-Paper
Advertisement

China Manja: కత్తి కన్నా డేంజర్.. పీకలు కోస్తున్న చైనా మాంజా.. గాయంతో కొట్టుమిట్టాడుతున్న ASI

China Manja: కత్తి కన్నా డేంజర్.. పీకలు కోస్తున్న చైనా మాంజా.. గాయంతో కొట్టుమిట్టాడుతున్న ASI

China Manja: హైదరాబాద్‌లో నిషేధిత చైనా మంజా మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేయడానికి వాడే ఈ ప్రమాదకరమైన దారం, ఒక పోలీస్ అధికారి ప్రాణాల మీదకు తెచ్చింది. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు, ఈ ప్రాణాంతక మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డారు.

పూర్తి సమాచారంలోకి వెళితే.. ఏఎస్ఐ నాగరాజు ఉప్పల్‌లోని తన నివాసం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) విధులకు హాజరయ్యేందుకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం సుమారు 4:20 గంటల సమయంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ గుండా వెళ్తుండగా, ఆకాశం నుండి తెగివచ్చిన చైనా మంజా ఆయన గొంతుకు బలంగా చుట్టుకుంది. ప్రయాణంలో ఉన్న ఆయన ఒక్కసారిగా గొంతు కోసుకుపోవడంతో బైక్ పై నుండి కిందపడిపోయారు.

తీవ్ర రక్తస్రావం అవుతున్న నాగరాజును వెంటనే గమనించిన స్థానికులు, తోటి సిబ్బంది, చికిత్స నిమిత్తం ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ మంజా గొంతులోని ప్రధాన నరాలకు తగలకుండా పోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం.

ప్రభుత్వం చైనా మంజా విక్రయాలపై, వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించినప్పటికీ, మార్కెట్లో ఇది ఇంకా రహస్యంగా అందుబాటులో ఉండటం పట్ల సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షులు, జంతువులతో పాటు వాహనదారుల ప్రాణాలకు ఈ దారం ముప్పుగా పరిణమిస్తోంది. పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, దాడులు చేస్తున్నా కొంతమంది వ్యాపారులు లాభాపేక్షతో వీటిని అమ్ముతూనే ఉన్నారు.

Also Read: మానవత్వం మంటగలిసింది.. ఆస్తి కోసం ఆగిన వృద్ధురాలి అంత్యక్రియలు

ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో ద్విచక్ర వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీలైతే బైక్‌లకు రక్షణ కవచాలు (U-shaped guards) అమర్చుకోవాలని లేదా గొంతు చుట్టూ మందపాటి స్కార్ఫ్ ధరించాలని సూచిస్తున్నారు. ఏఎస్ఐ నాగరాజు ఘటన నేపథ్యంలో, చైనా మంజా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నగరవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×