E-Paper
Advertisement

Ganja Chocolates Seized: జోరుగా గంజాయి చాక్లెట్ల వ్యాపారం.. 13 కేజీల సీజ్

Ganja Chocolates Seized: జోరుగా గంజాయి చాక్లెట్ల వ్యాపారం.. 13 కేజీల సీజ్
Advertisement

Ganja Chocolates Seized: గంజాయి చాక్లెట్లకు హైదరాబాద్ సిటీ అడ్డాగా మారిందా? ఈ వ్యాపారం చాపకింద నీరులా విస్తరిస్తోందా? వారంలో రెండు లేదా మూడుసార్లు గంజాయి చాక్లెట్లు వ్యవహారం పట్టుబడుతోందా? గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమా? లేటెస్ట్‌గా 13 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్ వెనుక ఏం జరిగింది?

గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ బాలానగర్ టీమ్. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై దాడి చేశారు. 61 ప్యాకెట్లలో ఉన్న 2400 (13 కేజీల) గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో వీటి విలువ దాదాపుగా లక్షరూపాయలు ఉంటుందని ఓ అంచనా.

Advertisement

గంజాయి చాక్లెట్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. నగరంలో ఏదో ఒక మూలన గంజాయి చాక్లెట్ల విక్రయాలు బయటపడుతున్నాయి. టీ స్టాల్ ముసుగులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహరంలో బుధవారం ఇద్దర్ని పోలీసులు చేశారు. గురువారం ఓ కిరాణా షాపులో సీక్రెట్‌గా సాగుతున్న గంజాయి చాక్లెట్ల వ్యవహారం రట్టయ్యింది.

హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన జగద్గిరి గుట్టలో ఓ కిరాణాషాపులో భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుంది ఎస్ఓటీ బాలానగర్ టీమ్. షాపు యజమాని సునీల్‌కుమార్ ఝాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు పోలీసులు.

Advertisement

ALSO READ:  కారులో మహిళ ఆత్మహత్య, ఏం జరిగింది?

పట్టుబడిన సునీల్ కుమార్ రెండు దశాబ్దాల కిందట కూలీ పనుల కోసం బీహార్ నుండి వలస వచ్చాడు. బిజినెస్ పెంచాలని ఆలోచన చేశాడు. చివరకు గంజాయి చాక్లెట్ల‌తో యువతను ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి సునీల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.

ఒక్కో చాక్లెట్ 40 రూపాయల చొప్పున వలస కార్మికులకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన జగత్‌గిరి గుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో గంజాయి చాక్లెట్లు గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×