Suspicious Death: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని తిమ్మాజీపేట మండలం బుద్ధ సముద్రంలో కొత్త సంవత్సరం గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొన్న శనివారం రాత్రి బాలిక ఇంట్లో కనిపించకుండా పోయి ఆదివారం రోజు ఉదయం పొలంలో శవమై కనిపించింది. బాలికను చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు.
Also Read: Bigg Boss 10 Telugu : ‘బిగ్ బాస్ 10’ ఈసారి స్టార్ మాలో రాదా..? కారణం ఇదే..?
శనివారం రోజు రాత్రి సమయంలో బాలిక ఎవరి చెప్పకుండా ఇంటి నుండి వెల్లిపోయింది. అదే రోజు ప్రేమికుల దినోత్సవం కాండం గమనార్హం.. అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గోవర్ధన్తో బాలిక ప్రేమలో ఉన్నట్లు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ఆదివారం రోజున ఉదయం బాలిక పోలంలో పడి ఉండటం గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం బాలిక మృతదేహన్ని పరిశీలించారు. పోలీసుల విచారణలో బాలిక ఒంటిపై గాయాలున్నాయని పేర్కోన్నారు. దీంతో పోలీసులు కేసు నమొదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన బాలిక శనివారం రాత్రి వెల్లి ఇంటికి తిరిగి రాకపోడంతో.. రాత్రంతా బాలిక ఎక్కడికి వెల్లింది. ఎవరితో ఉంది అనే కోణంలో పోలీసుల దర్యాప్తుచేస్తున్నారు. బాలిక ప్రియుడైన గోవర్ధన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్నారు. చేతికందిన బిడ్డ చనిపోడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సంఘటనతో గ్రామం అంతా విషాదచాయలు కమ్ముకున్నాయి.