E-Paper
Advertisement

Kakinada Crime: రుణం తీర్చుకోలేక కాదు.. రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక! సామర్లకోటలో వ్యక్తి ఆత్మహత్య

Kakinada Crime: రుణం తీర్చుకోలేక కాదు.. రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక! సామర్లకోటలో వ్యక్తి ఆత్మహత్య

Kakinada Crime: కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అత్యంత విషాదకరం. అప్పుల బాధ కంటే కూడా రికవరీ ఏజెంట్ల వేధింపులు ఒక మనిషి ప్రాణాన్ని తీసే వరకు వెళ్లడం సామాజికంగా ఆందోళన కలిగించే విషయం.

కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కరణం ఉమామహేశ్వరరావు ఎనిమిది నెలల క్రితం ఓ ప్రైవేటు బ్యాంకు నుండి సుమారు రూ. 8 లక్షల వరకు రుణం తీసుకున్నారు. అయితే.. కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన నెలవారీ వడ్డీని సకాలంలో చెల్లించలేకపోయారు. ఇదే తరుణంలో బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఆయనపై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు.

వడ్డీ కట్టలేదన్న సాకుతో రికవరీ ఏజెంట్లు ఫోన్ల ద్వారా, ప్రత్యక్షంగా తీవ్రంగా వేధించేవారు. గౌరవప్రదంగా బతికే వ్యక్తి కావడంతో.. ఏజెంట్ల అసభ్య ప్రవర్తన, వేధింపుల వల్ల ఉమామహేశ్వరరావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఆ మానసిక ఒత్తిడిని భరించలేక, చివరకు తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ప్రాణం ఇలా గాలిలో కలిసిపోవడం స్థానికంగా కలకలం రేపింది.

ALSO READ:  మోండా మార్కెట్‌లో భారీ చోరీ.. 16 తులాల బంగారం మాయం

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×