Kakinada Crime: కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అత్యంత విషాదకరం. అప్పుల బాధ కంటే కూడా రికవరీ ఏజెంట్ల వేధింపులు ఒక మనిషి ప్రాణాన్ని తీసే వరకు వెళ్లడం సామాజికంగా ఆందోళన కలిగించే విషయం.
కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కరణం ఉమామహేశ్వరరావు ఎనిమిది నెలల క్రితం ఓ ప్రైవేటు బ్యాంకు నుండి సుమారు రూ. 8 లక్షల వరకు రుణం తీసుకున్నారు. అయితే.. కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన నెలవారీ వడ్డీని సకాలంలో చెల్లించలేకపోయారు. ఇదే తరుణంలో బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఆయనపై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు.
వడ్డీ కట్టలేదన్న సాకుతో రికవరీ ఏజెంట్లు ఫోన్ల ద్వారా, ప్రత్యక్షంగా తీవ్రంగా వేధించేవారు. గౌరవప్రదంగా బతికే వ్యక్తి కావడంతో.. ఏజెంట్ల అసభ్య ప్రవర్తన, వేధింపుల వల్ల ఉమామహేశ్వరరావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఆ మానసిక ఒత్తిడిని భరించలేక, చివరకు తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ప్రాణం ఇలా గాలిలో కలిసిపోవడం స్థానికంగా కలకలం రేపింది.
ALSO READ: మోండా మార్కెట్లో భారీ చోరీ.. 16 తులాల బంగారం మాయం
లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు.. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కాకినాడ జిల్లా సామర్లకోటలో ఘటన
8 నెలల క్రితం ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.8 లక్షల రుణం తీసుకున్న కరణం ఉమామహేశ్వరరావు
ఆర్థిక ఇబ్బందులతో నెల వడ్డీ కట్టకపోవడంతో రికవరీ ఏజెంట్ల వేధింపులు
మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరి… pic.twitter.com/vwb0Dr9krh
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2026