ACB Raids: స్వేచ్చ బ్యూరో: కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్ కోసం బినామీ ఖాతాల ద్వారా లంచాలు వసూలు చేస్తున్న కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ దానుక రాధిక బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఐసీడీఎస్ పరిధిలో కోడిగుడ్లు, పప్పుధాన్యాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ల బిల్లులను త్వరగా పూర్తి చేయడానికి రాధిక లంచాలు డిమాండ్ చేశారు.
ఇందుకోసం కార్యాలయంలోని అవుట్సోర్సింగ్ సిబ్బంది, తన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను బినామీలుగా వాడుకుని, యూపీఐ (UPI) ద్వారా లంచం డబ్బులు బదిలీ చేయించుకున్నారు. జూన్-2022 నుండి ఏప్రిల్-2024 మధ్య కాలంలో ఆమె ఈ విధంగా రూ. 2,37,500 వసూలు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అక్రమ లావాదేవీలకు సహకరించాలని అవుట్సోర్సింగ్ సిబ్బందిని వేధించినట్లు అధికారులు గుర్తించారు.
Also read: సుపారీ గ్యాంగ్తో భార్య హత్య.. ఎట్టకేలకు భర్త అరెస్టు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
నిందితురాలిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 (టోల్ ఫ్రీ) లేదా వాట్సాప్ నెంబర్ 9440446106 లో సంప్రదించాలని ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచబడతాయని అధికారులు తెలిపారు.
Also read: Vizag Tragedy: ఏపీని వణికిస్తున్న స్టీల్ప్లాంట్ వివాదం.. వైఎస్ జగన్ ఓట్ల రాజకీయంపై టీడీపీ ఫైర్!