BT-3 Seeds: స్వేచ్చ బ్యూరో: రెండు దశాబ్దాలుగా ఉపాధి కల్పనకు కొనసాగుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA) స్థానంలో మరింత పటిష్టమైన చట్టాన్ని తీసుకురానుంది. ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (VB-GRAM G Act) పేరుతో ఈ నూతన వ్యవస్థను రూపొందించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2026 జులై 1వ తేదీ నుంచి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతుంది.
మెరుగైన జీవనోపాధి ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంజీనరేగా చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి లభిస్తోంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ కార్మికుల అవసరాలను గుర్తించిన కేంద్రం, పనిదినాల సంఖ్యను 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనంగా 25 రోజుల వేతనం కార్మికులకు లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం, గ్రామాల ఆర్థిక పురోభివృద్ధే ఈ నూతన చట్టం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ వివరించింది. 2026 జూన్ 30 నాటికి ఎంజీనరేగా కింద పురోగతిలో ఉన్న పనులన్నీ కొత్త చట్టం కిందకు బదిలీ అవుతాయి. ఎక్కడా పనులు ఆగిపోకుండా చర్యలు చేపడతారు.కొత్త కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఇ-కేవైసీ పూర్తి చేసిన కార్డులే చెల్లుబాటు అవుతాయి. కొత్తగా ఉపాధి కోరుకునే వారు వెంటనే గ్రామ పంచాయతీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.ఇ-కేవైసీ లేకున్నా ఉపాధికి విఘాతం లేదు.
Also read: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. రూ. 9 లక్షల నగదుతో వెళ్తుండగా కాటేసిన కాలం
చాలా చోట్ల ఇ-కేవైసీ ప్రక్రియ పెండింగ్లో ఉన్నప్పటికీ, కార్మికులకు పని కల్పించే విషయంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కేవైసీ పూర్తి కాకపోయినా ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించింది. పారదర్శకతను పెంచడంతో పాటు, సాంకేతికతను జోడించి కూలీల వేతనాలను నేరుగా వారి ఖాతాల్లోకి మరింత వేగంగా చేరవేసేలా ఈ కొత్త చట్టం రూపకల్పన జరిగింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ‘వికసిత్ భారత్’ ఉపాధి చట్టం అమల్లోకి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: మరోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం.. ఎన్డీయే నేతలు హాజరు