E-Paper
Advertisement

Kerala Fire Accident: రైల్వే స్టేషన్‌లో ఎగిసి పడుతున్న మంటలు.. 400 వాహనాలు దగ్ధం

Kerala Fire Accident: రైల్వే స్టేషన్‌లో ఎగిసి పడుతున్న మంటలు.. 400 వాహనాలు దగ్ధం
Advertisement

Kerala Fire Accident: కేరళలోని త్రిస్సూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షెడ్‌లో పార్క్ చేసిన సుమారు 400 బైక్‌లు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ తీగల నుంచి వచ్చిన నిప్పురవ్వల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గంటన్నరపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇదిలా ఉంటే.. ఒడిశాలోని దెంకనల్ జిల్లా గోపాల్ పూర్ సమీపంలో ఉన్న క్వారీలో భారీపేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరికొంతమంది శిథిలాల క్రింద చిక్కుకున్నట్లు సమాచారం. మృతులను బాలాసోర్ , కియోంఝర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అనుమతి లేని అక్రమ పేలుళ్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పాటిల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×