BigTV English

Khammam Car Accident Facts: ప్రమాదానికి గురైన కారులో దొరికిన సిరంజ్.. ఏంటని ఆరా తీయగా..!

Khammam Car Accident Facts: ప్రమాదానికి గురైన కారులో దొరికిన సిరంజ్.. ఏంటని ఆరా తీయగా..!

Khammam Car accident Shocking Facts: రోడ్డు ప్రమాదం జరిగినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ కారును పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీశారు. అయితే, వారికి కారులో ఓ సిరంజ్ దొరికింది. అది అనుమానాస్పదంగా కనిపించేసరికి దానిని స్వాధీనం చేసుకున్నారు.


అనంతరం ఎఫ్ఎస్ఎల్ కు పంపించగా, అసలు విషయం బయటపడింది. ఇటు పోస్ట్ మార్టమ్ రిపోర్టులో అదే విషయం వెల్లడింది. విషయం ఏంటని భర్తను విచారించగా.. భార్య, పిల్లలకు విషం కలిపిన ఇంజక్షన్ ఇచ్చి భర్తే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లుగా పోలీసులు తేల్చేశారు.

ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బాబోజితండాకు చెందిన బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), ఇద్దరు కుమార్తెలతో కలిసి మే 28న కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరాడు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో రహదారిపై వెళ్తున్న పలువురు ఇది గమనించారు. వెంటనే అక్కడికి చేరుకుని కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దురు కుమార్తెలు మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడి భార్యను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆమె కూడా అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.


Also Read: అమానుషం.. సొంత చెల్లినే గర్భవతిని చేసిన అన్న

Khammam Car accident sensational facts
Khammam Car accident sensational facts

ఈ ప్రమాదంలో ప్రవీణ్ కు స్వల్ప గాయాలు కావడంతో అతడిని బంధువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించారు. అయితే, ముగ్గురి మృతదేహాలపై గాయాలు కనిపించకపోవడంతో వారు అనుమానాలు వ్యక్తం చేశారు. భర్తే వీరిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తరఫు బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్దే ఆందోళన చేపట్టారు.

Also Read: Raithu Runamafi: రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

కాగా, ఘటన జరిగిన రోజున పోలీసులు కారును తనిఖీ చేశారు. ఆ కారులో ఖాళీ సిరంజ్ దొరికింది. అనుమానం రావడంతో దానిని స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్ కు పంపించగా.. విషం కలిపిన ఇంజక్షన్ ఇచ్చినట్టు తేలింది. ప్రవీణ్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో కూడా కీలక ఆధారం లభ్యమయ్యింది. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ ఇస్తే ఎన్నిగంటల్లో చనిపోతారనే విషయాలను ప్రవీణ్ గూగుల్ లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Related News

Konaseema Tragedy: కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు మృతి

Lift Collapse: విషాదం.. లిఫ్ట్ కూలి నలుగురు కార్మికులు మృతి

Nalgonda Crime: ఇంటర్ విద్యార్థినిపై ఘోరం.. ఆ మృగాడు వీడే, నల్గొండ జిల్లాలో దారుణం

Chevella Incident: చున్నీతో ఉరేసి ఫెన్సింగ్ పిల్లర్ రాయితో మోది భార్యను చంపిన భర్త

Chennai News: వ్యభిచారం రొంపిలోకి.. కమెడియన్‌, క్లబ్‌ డ్యాన్సర్‌ అరెస్ట్, మూలాలు ఏపీలో

Inter Student Suicide: దారుణం.. కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

Rajasthan News: రెండు ట్రక్కులు ఢీ.. గ్యాస్ సిలిండర్ల పేలుళ్ల శబ్దాలతో.. రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం

Odisha Crime: బీజేపీ లీడర్‌ను కాల్చి చంపేశారు.. ఒడిశాలో దారుణ ఘటన

Big Stories

×