E-Paper
Advertisement

Khammam Tragedy: టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల మందు తిని.. మూడేళ్ల చిన్నారి మృతి

Khammam Tragedy: టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల మందు తిని.. మూడేళ్ల చిన్నారి మృతి
Advertisement

Khammam Tragedy: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టూత్ పేస్ట్ అనుకుని.. ఎలుకల మందు తిని మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా గోవింద్ తండాకు చెందిన మూడేళ్ల చిన్నారి.. ఇంట్లో ఆడుకుంటూ టేబుల్ పై ఉన్న ఎలుక మందును టూత్ పేస్ట్ అనుకుని తినింది. కొంత సేపటికి చిన్నారికి వాంతులు, తలనొప్పి అస్వస్థకు గురైంది. గమనించిన తల్లి వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉందని హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

ఎలుకల మందు వంటి ప్రమాదకర రసాయనాలు పిల్లలకు కనిపించకుండా, అందని చోట ఉంచాలని హెచ్చరిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు అవగాహన లేక సాధారణ వస్తువుల్లా ఎక్కడబడితే అక్కడ ఉంచుతారు. కానీ అవి పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చని తెలిపారు.

Also Read: ప్రాణం తీసిన కిటికీ వివాదం.. సూసైడ్ నోట్ రాసి మరి..!

Advertisement

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా.. గ్రామస్థులు పిల్లల భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×