BigTV English

Lizard In School Meal: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

ప్రభుత్వ స్కూల్ లో పిల్లలకు పెట్టిన భోజనంలో బల్లి పడడంతో 30 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ మెదక్ జిల్లాలోని రామయంపేటలో తెలంగాణ మాడల్ స్కూల్ లో గత వారం జరిగింది. మీడియాలో ఈ ఘటనపై కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

Lizard In School Meal: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

Lizard In School Meal| ప్రభుత్వ స్కూల్ లో పిల్లలకు పెట్టిన భోజనంలో బల్లి పడడంతో 30 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ మెదక్ జిల్లాలోని రామయంపేటలో తెలంగాణ మాడల్ స్కూల్ లో గత వారం జరిగింది. మీడియాలో ఈ ఘటనపై కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.


మెదక్ జిల్లా రామాయంపేట మాడల్ స్కూల్‌లో హాస్టల్ విద్యార్థులకు ఉదయం టిఫిన్‌లో ఉప్మా వడ్డించారు. ఆ ఉప్మాలో బల్లి పడడంతో ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఆ ఉప్మా తిన్న తరువాత.. 30 విద్యార్థులకు వాంతులయ్యాయి. ముగ్గరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం.. డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడుకేషన్ అండ్ లిటరసీ సీరియస్ అయింది. దీనిపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read: దారుణం.. ప్రేయసి తల్లిదండ్రులను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది


తెలంగాణ ప్రభుత్వం.. ఈ ఘటనపై స్పందిస్తూ.. స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకున్నామని చెప్పింది. ప్రభుత్వం పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ ద్వారా పీఎం పోషణ్ పథకం పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని పాఠశాలల్లో టిఫిన్ పథకం కూడా ప్రారంభించింది.

ఇటీవలే మధ్యప్రదేశ్ లో భారత సైన్యంలో ఉద్యోగం పొందేందుకు కోచింగ్ తీసుకుంటున్న వంద మంది విద్యార్థులు హాస్టల్ భోజనం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి అనారోగ్యం పాలయ్యారు. వీరిలో 30 మంది ఆస్పత్రిలో కూడా చేరారు. వీరంతా ఒకే కోచింగ్ ఇన్స్‌టిట్యూట్ లో శిక్షన పొందుతున్నారు. ఇలాగే మధ్యప్రదేశ్ ఇందోర్ లో శ్రీ యుగ్ పురుష్ ధామ్ బౌధిక్ వికాస్ కేంద్రలో అయిదు మంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయారు.

Also Read: ఎనిమిదేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు మైనర్లు!

ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం స్పదించింది. ప్రభుత్వ పాఠశాల్లో భోజన భద్రత కోసం చర్యలు తీసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

Tags

Related News

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Big Stories

×