E-Paper
Advertisement

Lizard In School Meal: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

ప్రభుత్వ స్కూల్ లో పిల్లలకు పెట్టిన భోజనంలో బల్లి పడడంతో 30 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ మెదక్ జిల్లాలోని రామయంపేటలో తెలంగాణ మాడల్ స్కూల్ లో గత వారం జరిగింది. మీడియాలో ఈ ఘటనపై కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

Lizard In School Meal: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్
Advertisement

Lizard In School Meal| ప్రభుత్వ స్కూల్ లో పిల్లలకు పెట్టిన భోజనంలో బల్లి పడడంతో 30 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ మెదక్ జిల్లాలోని రామయంపేటలో తెలంగాణ మాడల్ స్కూల్ లో గత వారం జరిగింది. మీడియాలో ఈ ఘటనపై కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

మెదక్ జిల్లా రామాయంపేట మాడల్ స్కూల్‌లో హాస్టల్ విద్యార్థులకు ఉదయం టిఫిన్‌లో ఉప్మా వడ్డించారు. ఆ ఉప్మాలో బల్లి పడడంతో ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఆ ఉప్మా తిన్న తరువాత.. 30 విద్యార్థులకు వాంతులయ్యాయి. ముగ్గరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం.. డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడుకేషన్ అండ్ లిటరసీ సీరియస్ అయింది. దీనిపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Also Read: దారుణం.. ప్రేయసి తల్లిదండ్రులను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

తెలంగాణ ప్రభుత్వం.. ఈ ఘటనపై స్పందిస్తూ.. స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకున్నామని చెప్పింది. ప్రభుత్వం పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ ద్వారా పీఎం పోషణ్ పథకం పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని పాఠశాలల్లో టిఫిన్ పథకం కూడా ప్రారంభించింది.

Advertisement

ఇటీవలే మధ్యప్రదేశ్ లో భారత సైన్యంలో ఉద్యోగం పొందేందుకు కోచింగ్ తీసుకుంటున్న వంద మంది విద్యార్థులు హాస్టల్ భోజనం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి అనారోగ్యం పాలయ్యారు. వీరిలో 30 మంది ఆస్పత్రిలో కూడా చేరారు. వీరంతా ఒకే కోచింగ్ ఇన్స్‌టిట్యూట్ లో శిక్షన పొందుతున్నారు. ఇలాగే మధ్యప్రదేశ్ ఇందోర్ లో శ్రీ యుగ్ పురుష్ ధామ్ బౌధిక్ వికాస్ కేంద్రలో అయిదు మంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయారు.

Also Read: ఎనిమిదేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు మైనర్లు!

ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం స్పదించింది. ప్రభుత్వ పాఠశాల్లో భోజన భద్రత కోసం చర్యలు తీసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

Tags

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×