Coaching Fire: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్లో భారీగా అగ్నిప్రయాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మృతి చెందిన విద్యార్థులతో పాటు ప్రమాదంలో మరి కొంత మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ దారుణం చోటుచేసుకుంది. కోచింగ్ సెంటర్లో విద్యార్ధులకు క్లాసులు జరుగుతున్న సమయంలో ఓక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అది చూసిన విద్యార్థుల అరుపులతో కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగా మంటలు క్షణాల్లో పూర్తిగా భవణం మోత్తం అంటుకున్నాయి. ఈ ప్రమాదం మొదటగా మూడవ అంతస్థులో మొదలై బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగతో పాటు భారీగా మంటలు ఎగిసి పడుతుండంతో భయాందోళనుకు గురైన విధ్యార్థులు మూడవ అంతస్థు నుండి కొంత మంది విధ్యార్థులు కిటికీలొనుండి కిందికి దూకారు. దీంతో కొంత మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలవగా మరికొంత మంది అందులో ఉండి పోయి ఉపిరాడక అక్కడే మరణించారు. గాయాలైన వారిని అక్కడి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Also read: Temple Administration: తెలంగాణలో టెంపుల్ రూల్స్ మారుస్తూ.. సర్కార్ సంచలన నిర్ణయం!
ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఫైర్ సేఫ్టీ పోలీసులతో పాటు అక్కడి స్థానికుతో కలిసి మంటలను అదుపు చేసారు. ఈ ప్రమాదం భవనంలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయా లేదా ఎవరైనా కావాలని చేసారా అనే కోణంలో పోలీసులు కేసు నమెుదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 538 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!