Machkund Fire: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాంకేతిక కారణాల వల్ల పవర్ స్టేషన్ను అత్యవసరంగా షట్డౌన్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యుత్ కేంద్రం రెండో అంతస్తులో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు లోపలే చిక్కుకుపోయారు.
ప్రమాద స్థలంలో దట్టమైన పొగ, సెగలు అలుముకోవడంతో కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి సాధ్యం కావడం లేదు. పైగా ఈ పవర్ హౌస్ కొండల మధ్య, మారుమూల అటవీ ప్రాంతంలో ఉండటంతో అగ్నిమాపక వాహనాలు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.
రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో అటు ఏపీ, ఇటు ఒడిశా అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: రాజ్యాంగాన్ని కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యం.. బీజేపీది ఓట్ల చోరీ కుట్ర.. జగ్గారెడ్డి
మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
అల్లూరి జిల్లా పరిధిలోని ఏపీ, ఒడిశా ప్రభుత్వాల ఉమ్మడి మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
పవర్ స్టేషన్ను సాంకేతిక కారణాలతో షట్డౌన్ చేసిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాద తీవ్రతకు విద్యుత్ కేంద్రం రెండో… pic.twitter.com/eikOr0eulq
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2026