Hyderabad Crime: హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైసమ్మగూడలో విషాదం చోటుచేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న చాకలి మణికంఠ (18) అనే విద్యార్థి.. తాను నివసిస్తున్న గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మణికంఠ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. యువ ఇంజనీరింగ్ విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ALSO READ: Bangladesh: హిందువులపై అరాచకం.. బంగ్లాదేశ్లో ఇది పరిస్థితి