E-Paper
Advertisement

Road Accident: చెట్టుకు ఢీకొన్న ఆటో.. స్పాట్‌లోనే ఏడుగురు

Road Accident: చెట్టుకు ఢీకొన్న ఆటో.. స్పాట్‌లోనే ఏడుగురు
Advertisement

Road Accident: మెదక్ జిల్లాలోని పిల్లికొట్టల వద్ద.. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ నుండి మెదక్ వైపు బయలుదేరిన ఒక బ్యాటరీ ఆటో.. అతి వేగంగా ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి పెద్ద మర్రి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగి, క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

బీజేపీ ఫ్లెక్సీలు తీసేందుకు వెళ్తూ ప్రమాదం
ఈ ఏడుగురు కూలీలు బీజేపీ ఫ్లెక్సీలను తీయడానికి.. మేడ్చల్ నుండి మెదక్ వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వారు ఆటోలో బానేర్లు, పరికరాలతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని మర్రి చెట్టుకు ఢీకొట్టాడు.

Advertisement

ఢీ కొనడంతో మంటలు
ఘటన జరిగిన వెంటనే ఆటోలో మంటలు చెలరేగాయి. బ్యాటరీ వాహనం కావడంతో, మంటలు వేగంగా వ్యాపించాయి. ఆటోలో ఉన్న సురక్షిత సామగ్రిని కాపాడుకునే అవకాశం లేకుండా, ఆటో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రాణాపాయం తప్పిన కూలీలు
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు తీవ్రంగా గాయపడినప్పటికీ, వారందరూ ప్రాణాలతో బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. క్షతగాత్రులను వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

పోలీసుల స్పందన
రోడ్డుప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించేందుకు.. విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? లేక వాహనంలో ఏదైనా సాంకేతిక లోపమా.. అన్నది తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Also Read: పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద లారీ బోల్తా.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

ఈ ఘటన మరోసారి రోడ్డుప్రమాదాల పట్ల.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. బ్యాటరీ వాహనాలు అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ వ్యవస్థలపై మరింత అవగాహన అవసరం.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×