E-Paper
Advertisement

ఆరేళ్ల చిన్నారిపై దారుణం.. సంచలన తీర్పిచ్చిన కోర్టు..!

ఆరేళ్ల చిన్నారిపై దారుణం.. సంచలన తీర్పిచ్చిన కోర్టు..!
Advertisement

Crime News: స్వేచ్ఛ బ్యూరో: ఆరేళ్ల అమాయక బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిందితుడు పరమేశ్ యాదవ్ జవహర్‌నగర్‌లో నివాసముంటూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2024లో జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Also Read: తక్కువ బడ్జెట్‌లో.. లేటెస్ట్ ఫోన్ కొనాలా? రూ.10వేలలోపు టాప్ మొబైల్స్

రూ.10,000 జరిమానా..

Advertisement

కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేష్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఈ కేసులో జవహర్‌నగర్ పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, వైద్య ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తీర్పు వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసిందన్నారు.

Also Read: వాట్సాప్ స్టేటస్ క్వాలిటీ తగ్గుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో హెచ్‌డీ ఫోటోలు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×