E-Paper
Advertisement

కామినేనిలో కలకలం.. ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం? లెక్చరర్ మృతితో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత!

కామినేనిలో కలకలం.. ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం? లెక్చరర్ మృతితో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత!
Advertisement

Medical Negligence: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందంటూ బాధితుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రాంతానికి చెందిన లెక్చరర్ నరేష్, గుండెలో స్వల్ప అసౌకర్యంగా ఉందనే కారణంతో చికిత్స కోసం నగరానికి వచ్చారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, కేవలం పరీక్షల కోసం వెళ్లి శవమై తిరిగిరావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

జూనియర్ డాక్టర్ల చేతికి ఆపరేషన్ బాధ్యత?
నరేష్‌కు పరీక్షలు నిర్వహించిన కామినేని వైద్యులు, వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. అయితే, ఈ ఆపరేషన్‌ను అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు చేయాల్సి ఉండగా, కేవలం జూనియర్ డాక్టర్లతో చేయించారని మృతుడి బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అనుభవం లేని చేతుల్లోకి ప్రాణాలను అప్పగించడం వల్లే నరేష్ ప్రాణాలు కోల్పోయారని, మేనేజ్మెంట్ లాభాపేక్షతో రోగి ప్రాణాలతో చెలగాటమాడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

లక్షల ఫీజులు.. చివరికి మిగిలింది విషాదమే
ఈ ఆపరేషన్ కోసం ఆసుపత్రి యాజమాన్యం దాదాపు రూ. 8 లక్షలు ఖర్చు అవుతుందని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ ద్వారా రూ. 5 లక్షలు ఇప్పటికే వసూలు చేసుకున్నారని సమాచారం. భారీగా ఫీజులు వసూలు చేయడంలో చూపిన శ్రద్ధ, ప్రాణాలు కాపాడటంలో చూపలేదని బాధితులు మండిపడుతున్నారు. డబ్బులు చెల్లించుకున్నాక, ఆపరేషన్ థియేటర్ నుంచి నరేష్ విగతజీవిగా బయటకు రావడంతో కుటుంబం రోడ్డున పడింది.

Also Read: వివాహేతర బంధం కోసం ఘాతుకం.. భర్తను సుపారీ ఇచ్చి చంపించిన భార్య!

Advertisement

న్యాయం కోసం బాధితుల పోరాటం
నరేష్ మృతికి కారణమైన డాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. బాధ్యులైన వారిని అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక విద్యావంతుడు, సమాజానికి పాఠాలు చెప్పే లెక్చరర్ ఇలా ఆసుపత్రి నిర్లక్ష్యానికి బలికావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×