Highway Crash: ముంబయి-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మహారాష్ట్ర పరిధిలోని ధనివరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక ట్రక్కును, వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ట్రక్కు పూర్తిగా నుజ్జునుజ్జవగా.. అందులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నలిగిపోయిన వాహనాల క్యాబిన్ల నుంచి క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: రేవంత్ కంటే నాకే ఆస్తులు ఎక్కువ.. జగిత్యాల వేదికగా ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్
ముంబయి-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మహారాష్ట్ర పరిధిలోని ధనివరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక ట్రక్కును కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కులోని 12 మంది అక్కడికక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న… pic.twitter.com/3EZoJuxnRT
— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026