Nuzvid: క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ మహమ్మారి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నూజివీడుకు చెందిన షేక్ సుభాని (35) అనే యువకుడు డాక్యుమెంట్ రైటర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా అతడు క్రికెట్ బెట్టింగులతో పాటు వివిధ ఆన్లైన్ గేమ్లకు తీవ్రంగా బానిసయ్యాడు.
ఈ వ్యసనాల వల్ల సుభాని భారీగా డబ్బులు నష్టపోయాడు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించే క్రమంలో తెలిసిన వారి వద్ద, బయట పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. రోజురోజుకూ అప్పుల భారం పెరిగిపోవడం, ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
చివరకు ఆ అప్పుల బాధను తట్టుకోలేక, నూజివీడులోని తన కార్యాలయంలోనే ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజు చేపలు, రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
బెట్టింగ్కు బానిసైన డాక్యుమెంట్ రైటర్ సూసైడ్
ఏలూరు జిల్లా నూజివీడులో క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్కు బానిసైన షేక్ సుభాని(35) అనే డాక్యుమెంట్ రైటర్ తన కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని… pic.twitter.com/SPGxSIMSNH
— BIG TV Breaking News (@bigtvtelugu) June 9, 2026