E-Paper
Advertisement

ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!

ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!

Nuzvid: క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ మహమ్మారి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నూజివీడుకు చెందిన షేక్ సుభాని (35) అనే యువకుడు డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా అతడు క్రికెట్ బెట్టింగులతో పాటు వివిధ ఆన్‌లైన్ గేమ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడు.

ఈ వ్యసనాల వల్ల సుభాని భారీగా డబ్బులు నష్టపోయాడు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించే క్రమంలో తెలిసిన వారి వద్ద, బయట పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. రోజురోజుకూ అప్పుల భారం పెరిగిపోవడం, ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

చివరకు ఆ అప్పుల బాధను తట్టుకోలేక, నూజివీడులోని తన కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజు చేపలు, రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Related News

హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!

Crime News: రూపాయలు 110.. ఒక పాత ఫోన్.. ఈ నయా లూటీ కోసం మర్డర్ ప్లాన్ చేసిన డెలివరీ బాయ్స్!

యూట్యూబర్‌ని బోల్తా కొట్టించిన దొంగలు, బంగారం-డబ్బు దోచుకెళ్లారు? అదెలా సాధ్యం

విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!

గేమ్స్ ఆడొద్దన్నందుకు.. కన్నవారిపైనే కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు!

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!

మాచర్లలోని సినిమా థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Big Stories

×