Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణ గటన చోటు చేసుకుంది. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్స్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా వెళ్లిన ఐదుగురు యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. దీంతో ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. నిజామాబాద్కు చెందిన కొంమంది యువకులు బృందం గా చేరి నీటిలోకి దిగిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
జిల్లాలోని ప్రమాదకరమైన గుంతల్లో చిక్కుకుని నలుగురు యువకులు మునిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురు యువకుల మృతదేహాల వెలికితీసారు. మిగిలిన మరో ఇద్దరి యువకుల కోసం ఈతగాల్లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరీశీలించారు.
Also read: తిరువణ్ణామలై కొండపై మరో దారుణం.. ఇరుకైన రంధ్రంలో చిక్కుకున్న మహిళా భక్తురాలు!
సీఐ జాన్రెడ్డి, ఎస్సై కిరణ్కుమార్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. బ్యాక్వాటర్స్ ప్రాంతాలకు వెళ్లే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు అక్కడి ప్రాంత ప్రజలకు సూచించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. ఈ విషాద గటనతొ గ్రామంలో విషాద చాయులు అలుముకున్నాయి. మృతిచెందిన యువకు తల్లతండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఎస్ఆర్ఎస్పి లో గాలింపు చర్యలు జరుపుతున్నారు. ప్రమాద స్థలానికి సీపీ సాయి చైతన్య చేరుకున్నారు. గల్లంతు అయినా వారిలో ముగ్గురు మృత దేహల లభ్యం అవగా నిజామాబాద్ ఆటో నగర్కు చెందిన కలిమ్, నజవత్, అజీమ్ మృతదేహలుగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన హిమాయత్ నగర్కు చెందిన రేహాన్ అనే యువకుడి కోసం గాలింపు చేపట్టారు.
Also Read: పంజాబీ బ్లూటూత్ స్కామ్ టు కర్ణాటక SSLC లీక్.. విపక్షాలకు కమలం గట్టి కౌంటర్!