E-Paper
Advertisement

Ramadugu Murder Case: పెళ్లి జరగాల్సిన ఇంట తల్లి దారుణ హత్య.. గొంతు కోసి చంపిన దుండగులు

Ramadugu Murder Case: పెళ్లి జరగాల్సిన ఇంట తల్లి దారుణ హత్య.. గొంతు కోసి చంపిన దుండగులు
Advertisement

Ramadugu Murder Case: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గురువారం (మార్చి 05) పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఈరెల్లి గౌరమ్మ అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 8వ తేదీన గౌరమ్మ పెద్ద కుమారుడు మహేష్ వివాహం జరగాల్సి ఉంది. గౌరమ్మ భర్త కొమురయ్య గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి వచ్చేసరికి భార్య రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె పక్కనే కత్తి ఉండటంతో హతాశుడైన ఆయన ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ వివరాలను సేకరించారు. మృతురాలు గౌరమ్మకు మహేష్.. అనిల్ కుమార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్ ఇటీవలే వివాహం నిశ్చయం కావడంతో సింగపూర్ నుండి స్వగ్రామానికి వచ్చాడు. అయితే మహేష్ ఇండియాకు వచ్చినప్పటి నుండి అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. హత్య జరిగిన సమయంలో భర్త ఫంక్షన్‌కు.. పెద్ద కుమారుడు మహేష్ కరీంనగర్‌కు వెళ్లగా ఇంట్లో కేవలం మృతురాలు గౌరమ్మ, చిన్న కుమారుడు అనిల్ కుమార్ మాత్రమే ఉన్నారని ఏసీపీ వెల్లడించారు.

Advertisement

గురువారం మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు గౌరమ్మ గొంతు కోసి హత్య చేసిన తర్వాత ఇంటి లోపలి తలుపులన్నీ మూసివేసి.. బయట డోరును మాత్రం దగ్గరకు వేసి పరారయ్యారు. భర్త కొమురయ్య ఇంటికి వచ్చి చూసేసరికి గౌరమ్మ పడుకున్నట్లుగా ఉందని.. కానీ దగ్గరకు వెళ్లి చూడగా గొంతు కోసి ఉండటాన్ని గమనించారు. ఆ సమయంలో చిన్న కుమారుడు అనిల్ కుమార్ ఇంట్లో లేకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలాన్ని ఏసీపీ విజయ్ కుమార్ పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. సిఐ ప్రదీప్ కుమార్.. ఎస్సైలు.. పోలీస్ సిబ్బంది కూడా విచారణలో పాల్గొన్నారు. రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లి వేడుక ఆగిపోయి ఇంటి యజమానురాలు హత్యకు గురవ్వడంతో రామడుగు గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని.. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని ఏసీపీ విజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: Mahabubnagar district: తల్లి మందలింపుతో మనస్తాపం.. ఉరి వేసుకున్న దంపతులు.. మహబూబ్​నగర్ జిల్లాలో విషాదం

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×