E-Paper
Advertisement

5 Months Old Baby Dies: దారుణం.. పసికందుపై దాడి చేసి చంపేసిన పెంపుడు కుక్క!

5 Months Old Baby Dies: దారుణం.. పసికందుపై దాడి చేసి చంపేసిన పెంపుడు కుక్క!

Pet Dog killed 5 – Month- Old Baby: వికారాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఐదు నెలల పసి బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. జిల్లాలోని తాండూరు మండలంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఇందుకు సంబంధించి వెలువడుతున్న వివిధ వార్తా కథనాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధి బసవేశ్వర నగర్ లో ఉన్న ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలల బాలుడు ఉన్నాడు. పాలీష్ యూనిట్లో నాపరాయి కట్ చేస్తుండగా భర్తకు దాహం వేసింది. దీంతో అతను దాహం వేస్తుంది నీళ్లు తీసుకురావాలని  భార్యను కోరాడు. దీంతో భార్య ఇంట్లో ఆ పసికందును వదిలేసి నీళ్లు తీసుకుని తన భర్త వద్దకు వెళ్లింది. ఇంతలోనే అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఆ ఇంట్లోకి చొరబడింది. అనంతరం ఇంట్లో ఉన్న ఐదు నెలల పసికందుపై అతి క్రూరత్వంగా దాడి చేసింది. దీంతో 5 నెలల ఆ బాలుడు మృతిచెందాడు.

Also Read: హైదరాబాద్‌తో సహా ఆ జిల్లాల్లో వర్షం పడొచ్చు..? ఎప్పుడంటే..?

అయితే, కుక్క దాడి చేసిన సమయంలో ఆ బాలుడు ఏడుస్తుండగా గమనించిన తల్లి హుటాహుటినా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ బాలుడు అప్పటికే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×