Pet Dog killed 5 – Month- Old Baby: వికారాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఐదు నెలల పసి బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. జిల్లాలోని తాండూరు మండలంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఇందుకు సంబంధించి వెలువడుతున్న వివిధ వార్తా కథనాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధి బసవేశ్వర నగర్ లో ఉన్న ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలల బాలుడు ఉన్నాడు. పాలీష్ యూనిట్లో నాపరాయి కట్ చేస్తుండగా భర్తకు దాహం వేసింది. దీంతో అతను దాహం వేస్తుంది నీళ్లు తీసుకురావాలని భార్యను కోరాడు. దీంతో భార్య ఇంట్లో ఆ పసికందును వదిలేసి నీళ్లు తీసుకుని తన భర్త వద్దకు వెళ్లింది. ఇంతలోనే అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఆ ఇంట్లోకి చొరబడింది. అనంతరం ఇంట్లో ఉన్న ఐదు నెలల పసికందుపై అతి క్రూరత్వంగా దాడి చేసింది. దీంతో 5 నెలల ఆ బాలుడు మృతిచెందాడు.
Also Read: హైదరాబాద్తో సహా ఆ జిల్లాల్లో వర్షం పడొచ్చు..? ఎప్పుడంటే..?
అయితే, కుక్క దాడి చేసిన సమయంలో ఆ బాలుడు ఏడుస్తుండగా గమనించిన తల్లి హుటాహుటినా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ బాలుడు అప్పటికే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.