E-Paper
Advertisement

Rain Alert to Telangana: మరో రెండు రోజుల వరకు హైదరాబాద్‌తో సహా ఆ జిల్లాల్లో వర్షం..

Rain Alert to Telangana: మరో రెండు రోజుల వరకు హైదరాబాద్‌తో సహా ఆ జిల్లాల్లో వర్షం..
Advertisement

Telangana Weather Updates : గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం నెలకొంటున్న విషయం తెలిసిందే. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు.. సాయంత్రం, రాత్రి సమయాల్లో అప్పుడప్పుడు వర్షం, ఈదురుగాలు. ఈ భిన్న వాతావరణం దాదాపుగా వారం రోజుల నుంచి కొనసాగుతోంది. వర్షాలు కురుస్తున్నా పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసిన విషయం తెలిసిందే.

అయితే, తాజాగా వాతావరణ శాఖ మరో శుభవార్త చెప్పింది. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్లా భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్లా మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.

Advertisement

ఈనెల 17 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో నేడు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఈ జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో పలు చోట్లా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. హైదరాబాద్ నగరంలో నేడు, రేపు, ఎల్లుండి రాత్రి సమయంలో జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.

Also Read: Bandi sanjay comments: సంజయ్ కామెంట్స్, ఫలితాల తర్వాత కేసీఆర్…

Advertisement

కాగా, సోమవారం ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈదురుగాలుల కారణంగా కోపర్ లోని సమతా నగర్ లో భారీ హోర్డింగ్ మీద పడి 14 మంది మృతి చెందగా, సుమారు 60 మందికి పైగా గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. హోర్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీశారు. అయితే, కూలిన ఆ భారీ హోర్డింగ్ ను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేశారని ముంబై నగర పాలక సంస్థ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.

Also Read: హైదరాబాద్ బాట పట్టిన ఓటర్లు.. రహదారుల్లో వాహనాల రద్దీ

అదేవిధంగా వడాలాలో కూడా ఓ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

Tags

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×