E-Paper
Advertisement

Puri Beach: బీచ్‌లో ఘోరం.. యువతిపై అఘాయిత్యం, ప్రియుడ్ని చెట్టుకు కట్టేసి

Puri Beach: బీచ్‌లో ఘోరం.. యువతిపై అఘాయిత్యం, ప్రియుడ్ని చెట్టుకు కట్టేసి

Puri Beach: ఒడిశాలోని పూరీ బీచ్‌లో దారుణం జరిగింది. 19 ఏళ్ల విద్యార్థిణిపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బీచ్‌ సమీపంలో ప్రియుడి కళ్ల ముందు ఈ ఘోరం జరిగింది. అసలు బీచ్‌లో జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో ఒడిషాలో రకరకాల ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శనివారం సాయంత్రం పూరీ బీచ్‌లో దారుణమైన ఘటన జరిగింది. 19 ఏళ్ల ఓ యువతి సాయంత్రం వేళ తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లింది. వారు కూర్చున్న సమయంలో వారిని తమ సెల్‌ఫోన్‌లో బంధించారు నలుగురు యువకులు.

దీన్ని గమనించిన యువతీయువకుడు వాటిని ఫోన్ నుంచి తొలగించాలని కోరారు. ఈ క్రమంలో పోకిరీలు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. డబ్బులు ఇచ్చేందుకు వారిద్దరు నిరాకరించారు. వచ్చినవారు నలుగురు యువకులు కావడంతో తొలుత యువకుడ్ని చెట్టుకి కట్టేశారు. అందులో ఇద్దరు యువతిపై అత్యాచారం చేశారు.

అక్కడి నుంచి ఇంటికి పోయింది యువతి. వేధింపుల గాయం నుండి బయటపడిన తర్వాత సోమవారం టీనేజ్ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నలుగురు నిందితులు స్థానికులే. అరెస్టుకు ముందు నిందితులు ఆ ఫుటేజ్ తొలగించినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. మరొకడు పరారీలో ఉన్నాడు.

ALSO READ: గద్వాల జిల్లాలో దారుణం.. నిద్రపోతున్న భర్తపై వేడి నూనె పోసిన భార్య

ఈ మధ్యకాలంలో ఒడిశాలో అత్యాచార ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. గత బుధవారం భువనేశ్వర్‌లోని ఓ లాడ్జిలో ఒక మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి పెద్ద మ్యూజికల్ బ్యాండ్‌లో అవకాశం ఇప్పిస్తామని నమ్మించి లాడ్జ్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెకు మత్తు పానీయం ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను శనివారం అరెస్ట్ చేశారు.

సెప్టెంబర్ 5న గణేష్ విగ్రహ నిమజ్జనాన్ని వెళ్లిన 14 ఏళ్ల బాలికపై కంధమాల్‌లో 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి ఐదు రోజుల తర్వాత నిందితుడ్ని అరెస్టు చేశారు. బాధిత విద్యార్థి 9వ తరగతి చదువుతోంది. తన కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి వాహనంలో ఆమెపై అత్యాచారం చేశాడు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, మృతులు పెరిగే అవకాశం? పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×