E-Paper
Advertisement

Trains Cancelled: సికింద్రాబాద్‌కు వెళ్లే ఈ రైళ్లు క్యాన్సిల్.. కొన్ని డైవర్ట్!

Trains Cancelled: సికింద్రాబాద్‌కు వెళ్లే ఈ రైళ్లు క్యాన్సిల్.. కొన్ని డైవర్ట్!

Indian Railways:

ఈస్ట్ కోస్ట్ రైల్వే తన పరిధిలోని పలు సెక్షన్లలలో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా జాజ్‌ పూర్ కియోంజార్ రోడ్-  భద్రక్ సెక్షన్ మధ్య భద్రతకు సంబంధించిన ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకల్లో తాత్కాలికంగా కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు  అమలుల్లో ఉంటాయని తెలిపింది. పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంతకీ ఆ పనులు కారణంగా ఎఫెక్ట్ అవుతున్న రైళ్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿రద్దైన రైళ్లు ఇవే!  

పూరి–జలేశ్వర్–పూరి మెము (68442/68441) రైళ్లు సెప్టెంబర్ 16, 19, 20, 22 తేదీలలో(సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం) రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. అటు భద్రక్ మెము (68424) రైలు సెప్టెంబర్ 17, 21 (మంగళవారం, శనివారం) తేదీలలో జాజ్‌ పూర్ కియోంజార్ రోడ్ దగ్గర స్వల్పంగా రద్దు చేయనున్నారు. అటు భద్రక్ – కటక్ మెము (68423) అదే రోజుల్లో భద్రక్‌కు బదులుగా జా జ్‌పూర్ కియోంజార్ రోడ్ నుండి బయలుదేరుతుంది. కటక్ – భద్రక్ మెము (68438) రైలు సెప్టెంబర్ 19, 22 (గురువారం, ఆదివారం) తేదీలలో జాజ్‌ పూర్ కియోంజార్ రోడ్ దగ్గర స్వల్ప సమయం పాటు రద్దు చేయనున్నారు. అటు భద్రక్ – కటక్ మెము (68437)కూడా జాజ్‌ పూర్ కియోంజార్ రోడ్ నుంచి బయలుదేరుతుంది.

Read Also: రైల్వే కొత్త రూల్.. ఇకపై మొదటి 15 నిమిషాలు వారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి!

⦿ రీషెడ్యూల్ చేయబడిన రైళ్లు

హౌరా – సికింద్రాబాద్ ఫలక్‌ నుమా ఎక్స్‌ ప్రెస్ (12703) సెప్టెంబర్ 17, 21 (మంగళవారం మరియు శనివారం) తేదీలలో 1 గంట 30 నిమిషాలు రీ షెడ్యూల్ చేయబడింది. చెన్నై-హౌరా ఎక్స్‌ ప్రెస్ (12840) సెప్టెంబర్ 18, 21 (బుధవారం, శనివారం) తేదీలలో 2 గంటలు తిరిగి షెడ్యూల్ చేయబడింది. పూరి-జైనగర్ ఎక్స్‌ ప్రెస్ (18419) సెప్టెంబర్ 19 (గురువారం)న 1 గంట ఆలస్యంగా షెడ్యూల్ చేయబడింది.

రైల్వే అధికారులు కీలక సూచనలు

పలు రైళ్ల రాకపోకల్లో కీలక మార్పులు చేర్పులు జరిగిన నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణీకులకు కీలక సూచనలు చేశారు. ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.

Read Also: దీపావళికి ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ఏయే రూట్లలో అంటే?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×