E-Paper
Advertisement

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. విజయశాంతి రెడ్డి సీన్ రిపీట్, ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి సూసైడ్

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. విజయశాంతి రెడ్డి సీన్ రిపీట్, ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి సూసైడ్

తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు సంసారాన్ని చిదిమేసాయి. కృష్ణానగర్ మూడో వీధిలో నివాసముంటున్న ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానిక సమాచారం ప్రకారం, కృష్ణానగర్‌కు చెందిన పద్మ అనే మహిళ తన కుమార్తెలు తేజ (7), లాస్య (5)లతో కలిసి ఇంట్లోనే ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పద్మ భర్త ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఇద్దరు పిల్లలతో కొన్నేళ్లపాటు సంతోషంగానే గడిపారు. అయితే, గత కొంతకాలంగా కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలైనట్లు తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందులే కారణమా?

మధ్యతరగతి కుటుంబం కావడంతో.. పెరుగుతున్న ఖర్చులు, అప్పుల భారం పద్మను మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ.. వస్తున్న ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక పోవడం, దానికి తోడు ఇతర ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

ముక్కుపచ్చలారని ఏడేళ్ల తేజ, ఐదేళ్ల లాస్యలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన చిన్నారి తల్లులు తల్లితో పాటే అనంత లోకాలకు వెళ్లిపోవడం ఆ వీధిలో విషాద ఛాయలు నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఎంతటి కష్టం వచ్చినా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, ఆపదలో ఉన్నప్పుడు మానసిక నిపుణులను లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.

ALSO READ: CIBIL Score: నెల రోజుల్లో సిబిల్ స్కోర్ ఇలా సింపుల్ గా పెంచేయండి, లోన్ త్వరగా వచ్చేస్తుంది

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×