E-Paper
Advertisement

Husband Sets House on fire: భార్యాభర్తల మధ్య గొడవ.. ఇల్లు తగలబెట్టిన భర్త

Husband Sets House on fire: భార్యాభర్తల మధ్య గొడవ.. ఇల్లు తగలబెట్టిన భర్త

Husband sets house on fire: రానురాను కొందరి మనుషుల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. అటుపై ఆ కోపం ఏ ప్రమాదానికి దారి తీస్తుందో అర్థం కావడంలేదు. ఆ కోపం వల్ల మనో విచక్షణ కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి అడవి జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఇందుకు ఉదాహరణ తాజాగా చోటు చేసుకున్నటువంటి ఓ సంఘటన. భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగింది. భార్యమీద కోపంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త.. భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు స్వల్వ గాయాలు కాగా, ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామానికి చెందిన ఓ భార్యాభర్తలు శనివారం గొడవపడ్డారు. అంతటితో ఆగకుండా తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి భర్త.. భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. స్థానికులు గమనించి భార్యను కాపాడారు.

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్

ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు స్వల్ప గాయాలు కాగా, ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలిసి స్థానికులు.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×