E-Paper
Advertisement

Newborn Baby in Dustbin: దారుణం.. అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Newborn Baby in Dustbin: దారుణం.. అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Newborn Baby in Dustbin: నేటి సమాజంలో మానవత్వం మంటగలిసింది. అతి దారుణంగా పసి ప్రాణాలను కూడా వదలకుండా చంపుతున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా మైలర్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డి నగర్‌లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మానవత్వాన్ని మరిచి, అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్పలో పారవేశారు.

దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి, సరైన సంరక్షణ లేక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణాన్ని గమనించిన పరిసర ప్రాంతాల ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మైలర్‌దేవ్‌పల్లి పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: పుట్టింటి నుంచి రానన్న భార్య.. పురుగుల మందు తాగి చనిపోయిన భర్త

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు? కన్నవారే వదిలేశారా? లేదా నిజంగానే గుర్తు తెలియని వ్యక్తుల వదిలేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు. ఏదిఏమైనా ఒక చిన్నారి పసికందును పొట్టనబెట్టుకున్నా వారిని మాత్రం అస్సలు వదలకూడదు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×