Road Accident: రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. ఒకటి కాదు.. రెండు కాదు.. రోజు జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం బయటకు వస్తే చాలు.. మళ్లీ తిరిగి ఇంటికి వెళ్తాము అనే నమ్మకం పోతుంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం మరవక ముందే.. మరో ప్రమాదం.. ఎక్కడంటే.. హైదరాబాద్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బేగంపేట్ బస్స్టాప్ వద్ద.. థార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది హెవీ లోడ్తో వెళ్తున్న కంటైనర్.
ఈ ప్రమాదంలో థార్ వెనుక భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. కంటైనర్ బోల్తా పడింది. థార్ వాహనంలో వెళ్తున్న ముగ్గరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. యాక్సిడెంట్లో కంటైనర్ డ్రైవర్ తీవ్ర గాయాల పాలవ్వగా.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంటైనర్ సనత్ నగర్ నుంచి మౌలాలి వైపు వెళ్తుండగా.. వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. అదనపు కట్నం వేధింపులకు గర్భిణి బలి..
సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థార్ వెహికల్లో.. మహమ్మద్ రబ్బాని, తన ఇద్దరు పిల్లల్ని స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం.. పరేడ్ గ్రౌండ్కి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది.
బేగంపేట్ బస్ స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం..
థార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టి బోల్తా పడ్డ హెవీ లోడ్ ట్రక్
నుజ్జు నుజ్జు అయిన థార్ వాహనం వెనుక భాగం
ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు
థార్ వాహనంలో ఎంతమంది ఉన్నారనేది… pic.twitter.com/0UjmWLX2Pm
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2025