BigTV English

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

Road Accident in AP Three youths died:  తిరుపతి జిల్లాలో హోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకాల మండలం పత్తిపాటివారిపల్లెలో లారీ, భైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా..ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు జయచంద్ర(34), నారాయణ(35), నాగ మల్లయ్య(14)గా గుర్తించారు.


చిత్తూరు-కర్నూల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మృతదేహాలు లారీ కింద పడి నుజ్జునుజ్జుయ్యాయి. ఐరాల మండలంలోని వేదగిరివారిపల్లి పంచాయతీ నుంచి నలుగురు యువకులు బైక్‌పై దామలచెరువుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

బైక్‌ను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై చీకటి ఉండడంతో ఏం జరిగిందో స్థానికులు అర్థం కాలేదు. అయితే యువకులతోపాటు బైక్‌ను లారీ రోడ్డుపై ఈడ్చుకుంటూ సుమారు 150 మీటర్ల దూరం వరకు వెళ్లింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్ అతివేగంతోపాటు బైక్‌పై పరిమితికి మించి ప్రయాణించడంతోనే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మనోజ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే. ఈ ఘటనలో మృతి చెందిన జయచంద్రకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే నారాయణ భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉండన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×