E-Paper
Advertisement

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి
Advertisement

Road Accident in AP Three youths died:  తిరుపతి జిల్లాలో హోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకాల మండలం పత్తిపాటివారిపల్లెలో లారీ, భైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా..ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు జయచంద్ర(34), నారాయణ(35), నాగ మల్లయ్య(14)గా గుర్తించారు.

చిత్తూరు-కర్నూల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మృతదేహాలు లారీ కింద పడి నుజ్జునుజ్జుయ్యాయి. ఐరాల మండలంలోని వేదగిరివారిపల్లి పంచాయతీ నుంచి నలుగురు యువకులు బైక్‌పై దామలచెరువుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

బైక్‌ను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై చీకటి ఉండడంతో ఏం జరిగిందో స్థానికులు అర్థం కాలేదు. అయితే యువకులతోపాటు బైక్‌ను లారీ రోడ్డుపై ఈడ్చుకుంటూ సుమారు 150 మీటర్ల దూరం వరకు వెళ్లింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్ అతివేగంతోపాటు బైక్‌పై పరిమితికి మించి ప్రయాణించడంతోనే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మనోజ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే. ఈ ఘటనలో మృతి చెందిన జయచంద్రకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే నారాయణ భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉండన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×