BigTV English
Advertisement

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

Road Accident in AP Three youths died:  తిరుపతి జిల్లాలో హోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకాల మండలం పత్తిపాటివారిపల్లెలో లారీ, భైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా..ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు జయచంద్ర(34), నారాయణ(35), నాగ మల్లయ్య(14)గా గుర్తించారు.


చిత్తూరు-కర్నూల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మృతదేహాలు లారీ కింద పడి నుజ్జునుజ్జుయ్యాయి. ఐరాల మండలంలోని వేదగిరివారిపల్లి పంచాయతీ నుంచి నలుగురు యువకులు బైక్‌పై దామలచెరువుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

బైక్‌ను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై చీకటి ఉండడంతో ఏం జరిగిందో స్థానికులు అర్థం కాలేదు. అయితే యువకులతోపాటు బైక్‌ను లారీ రోడ్డుపై ఈడ్చుకుంటూ సుమారు 150 మీటర్ల దూరం వరకు వెళ్లింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్ అతివేగంతోపాటు బైక్‌పై పరిమితికి మించి ప్రయాణించడంతోనే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మనోజ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే. ఈ ఘటనలో మృతి చెందిన జయచంద్రకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే నారాయణ భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉండన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags

Related News

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

Big Stories

×