BigTV English

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. 10 మంది మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. 10 మంది మృతి

Road Accident: కాయగూరలు అమ్ముకుంటున్న రైతులపై మృత్యువులా దూసుకెళ్లింది ఓ లారీ. రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. చేవెళ్ల మండలం ఆర్డర్‌ గేటు దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.  మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- బీజాపూర్ రహదారి పక్కన కొంత మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారి పైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దూసుకొస్తున్న లారీని చూసి.. గమనించిన కొందరు భయంతో  పరుగులు తీశారు. వ్యాపారులపై దూసుకెళ్తూ లారీ చెట్టును ఢీకొంది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి.

Also Read: హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ హత్య.. వెలుగులోకి కొత్త కోణం?


మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటినా ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఇంకేదన్నా కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×