E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. 10 మంది మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. 10 మంది మృతి

Road Accident: కాయగూరలు అమ్ముకుంటున్న రైతులపై మృత్యువులా దూసుకెళ్లింది ఓ లారీ. రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. చేవెళ్ల మండలం ఆర్డర్‌ గేటు దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.  మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- బీజాపూర్ రహదారి పక్కన కొంత మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారి పైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దూసుకొస్తున్న లారీని చూసి.. గమనించిన కొందరు భయంతో  పరుగులు తీశారు. వ్యాపారులపై దూసుకెళ్తూ లారీ చెట్టును ఢీకొంది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి.

Also Read: హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ హత్య.. వెలుగులోకి కొత్త కోణం?

మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటినా ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఇంకేదన్నా కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×