E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. 10 మంది మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. 10 మంది మృతి
Advertisement

Road Accident: కాయగూరలు అమ్ముకుంటున్న రైతులపై మృత్యువులా దూసుకెళ్లింది ఓ లారీ. రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. చేవెళ్ల మండలం ఆర్డర్‌ గేటు దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.  మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- బీజాపూర్ రహదారి పక్కన కొంత మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారి పైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దూసుకొస్తున్న లారీని చూసి.. గమనించిన కొందరు భయంతో  పరుగులు తీశారు. వ్యాపారులపై దూసుకెళ్తూ లారీ చెట్టును ఢీకొంది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ హత్య.. వెలుగులోకి కొత్త కోణం?

మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటినా ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఇంకేదన్నా కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×