E-Paper
Advertisement

Medak Crime: అయ్యో పాపం.. ఎంత పని చేశావ్ దేవుడా…? రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌డెడ్

Medak Crime: అయ్యో పాపం.. ఎంత పని చేశావ్ దేవుడా…? రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌డెడ్

Medak Crime: మెదక్ జిల్లాలో పెను విషాదం నెలకొంది. ఓ గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక సంఘటన పెద్ద శంకరంపేట సమీపంలోని 161వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్తుండగా మృత్యువు కబళించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన లింగమయ్య, సాయమ్మ, వారి పిల్లలు మానస, సాయిగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లోని లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. స్వగ్రామంలో ఓటు వేసేందుకు తమ ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఈ కుటుంబం, గమ్యస్థానానికి చేరుకోకముందే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు వారిని కబళించింది.

ఘటనా స్థలిలో విషాద దృశ్యాలు

అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ప్రమాద ధాటికి నలుగురూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. స్థానికులు గమనించి సమాచారం అందించే లోపే వారు తుదిశ్వాస విడిచారు. మృతదేహాలు రోడ్డుపై పడి ఉన్న తీరు చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఒకే కుటుంబంలోని నలుగురు మరణించడంతో మాగీ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ALSO READ: Pawan Kalyan: ఉదయం విజ్ఞప్తి సాయంత్రానికి రోడ్డు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×