Road Accident: నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని తిమ్మనపల్లి గ్రామ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఒక భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహాదేవి, మేఘ, రాంరెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారా లేక బంధువులా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద వార్తతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: మరణంలోనూ వీడని బంధం.. భార్య మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన భర్త
తిమ్మనపల్లి సమీపంలోని ఈ మలుపు వద్ద గతంలోనూ చిన్నపాటి ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలంటే ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున వాహనాలు నడిపేటప్పుడు అతివేగాన్ని నియంత్రించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రూజర్ వాహనాన్ని క్రేన్ సహాయంతో రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
కల్వర్టును ఢీకొన్న క్రూజర్ వాహనం
అక్కడికక్కడే ముగ్గురు మృతి
పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతులు మహాదేవి, మేఘ, రాంరెడ్డిగా గుర్తింపు
Horrific road accident in Timmanapalli, Nandyal district. Cruiser vehicle… pic.twitter.com/X7E9DRhFiW
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2026